స్టార్ ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన సక్సెస్ లేక వెనుకబడ్డ హీరో అల్లు శిరీష్. అడపాదడపా సినిమాలు చేస్తున్నా ఎక్కువ శాతం ఫ్లాపులు ఉండటంతో గ్యాప్ తీసుకోవాల్సి వస్తోంది. ఊర్వశివో రాక్షసివోకి డీసెంట్ టాక్ వచ్చినా అది కలెక్షన్లలోకి మారకపోవడం విచిత్రం. ఇప్పుడు కొత్తగా బడ్డీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇది కూడా నెలల తరబడి వాయిదా పడిందే కానీ కంటెంట్ బలంగా ఉంటుందని టీమ్ అంటోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఇది దేనికీ రీమేక్ కాదని శిరీష్ స్పష్టం చేశాడు. పూర్తిగా కొత్త సబ్జెక్టుతో వచ్చామని అన్నాడు.
కథను దాచకుండా రెండున్నర నిమిషాల వీడియోలో చెప్పేశారు. ఎయిర్ పైలట్ గా పని చేసే ఆదిత్యరామ్ (అల్లు శిరీష్) సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో తన వల్లే నష్టపోయానని చెబుతున్న ఒక విలన్ (అజ్మల్) వల్ల సమస్యలు మొదలవుతాయి. ఎక్కడో దూరంగా కనిపించని చోట ఉండే అతని డెన్ కు ఒంటరిగా వెళ్లే పరిస్థితులు తలెత్తుతాయి. అప్పుడే ఒక నడిచే మాట్లాడే టెడ్డి బేర్ బొమ్మ తోడొస్తుంది. అన్యాయం జరిగితే చాలు అక్కడ ప్రత్యక్షం అయ్యే ఈ బొమ్మ రాకాసిని తీసుకెళ్లిన ఆదిత్య చివరికి మిషన్ ని ఎలా పూర్తి చేశాడనే పాయింట్ తో టెడ్డి రూపొందింది.
దర్శకుడు సామ్ అంటోన్ తీసుకున్న పాయింట్ వైవిధ్యంగానే ఉంది. అరటిపండు ఒలిచినట్టు స్టోరీ మొత్తం రివీల్ చేశారంటే అసలు మ్యాటర్ బలంగా ఉండుండాలి. హిప్ హాప్ తమిజా సంగీతం, విమానం విజువల్స్ లో చూపించిన గ్రాఫిక్స్, మంచి క్యాస్టింగ్ గట్రా చూస్తుంటే రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు భిన్నంగా ఏదో ట్రై చేసిన ఫీలింగ్ అయితే కలుగుతోంది. బ్రదరాఫ్ బన్నీ నుంచి సోలో హీరోగా మార్కెట్ ని సంపాదించుకోవడానికి కష్టపడుతున్న అల్లు శిరీష్ కి టెడ్డి ఎలాంటి బ్రేక్ ఇవ్వనుందో జూలై 26న తేలిపోతుంది. నెల రోజుల ముందే ప్రమోషన్లు మొదలుపెట్టడం విశేషం.
This post was last modified on June 25, 2024 9:22 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…