సంగీత దర్శకుడిగా తమిళంలో మంచి పేరున్న సంతోష్ నారాయణన్ ఇండస్ట్రీకి వచ్చి పన్నెండు సంవత్సరాలు దాటింది. కోలీవుడ్ లో విపరీతమైన పోటీని తట్టుకుని తనదైన ముద్రని వేయగలిగాడంటే దానికి కారణం అతనిచ్చే ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. మంచి ఛార్ట్ బస్టర్ పాటలు ఎన్నో ఉన్నాయి కానీ దర్శకుల ఎంపికలో అతని వైపు నుంచి పెద్ద పీఠ తీసుకునేది మాత్రం బీజీఎమ్. నాని దసరాకు అది ఎంత ఉపయోగపడిందో చూశాం. వెంకటేష్ సైంధవ్, యాత్ర 2 నిరాశపరిచినప్పటికీ వాటి కంటెంట్ లో ఉన్న బలహీనతల వల్ల తన నుంచి బెస్ట్ వర్క్ ఆశించడానికి లేకుండా పోయింది.
ఇప్పటిదాకా అతని కెరీర్ లో జరిగింది ఒక ఎత్తు. ఇప్పుడు కల్కి 2898 ఏడికి పని చేయడం మరో ఎత్తు. ఎందుకంటే దీంట్లో సాంగ్స్ కి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఏదో ఆడియో మార్కెట్ కోసం మొక్కుబడిగా రెండు మూడు పాటలు పెట్టాడు కానీ దర్శకుడు నాగఅశ్విన్ ఉద్దేశం మాత్రం భారతీయ తెరమీద ఒక గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని. అందుకే కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా హాలీవుడ్ స్టాండర్డ్ లో తెరకెక్కించిన విధానం ట్రైలర్ లోనే బయట పడింది. ఇది థియేటర్లో ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో నేపధ్య సంగీతం పాత్ర చాలా కీలకం. గూస్ బంప్స్ కి ఎక్కడా తగ్గకూడదు.
ప్రాజెక్టు మొదలైనప్పుడు తీసుకున్న మిక్కీ జె మేయర్ ని కాదని సంతోష్ నారాయణన్ ను తీసుకోవడం ద్వారా నాగ అశ్విన్ తీసుకున్నది రిస్క్ అయినా అది తన పనితనం మీదున్న నమ్మకమే. తమన్, దేవిశ్రీప్రసాద్, కీరవాణి, జివి ప్రకాష్, జీబ్రాన్, మణిశర్మ లాంటి ఆప్షన్లు ఉన్నప్పటికీ ఓటు మాత్రం సంతోష్ కే వేశాడు. అంచనాలు కనక అందుకుంటే మాత్రం చరిత్ర లిఖించబోయే ఒక ప్యాన్ ఇండియా మూవీకి పని చేసిన గొప్ప ఘనత దక్కుతుంది. దర్శకుడి విజన్ ని ఏ మాత్రం తగ్గించకుండా ఎలివేట్ చేయడంతో ఇతని పాత్ర చాలా కీలకం. దాన్ని నిలబెట్టుకుంటే అసలు విజేత తనే అవుతాడు.
This post was last modified on June 24, 2024 9:42 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…