ఎన్నికల ముందు వరకు ఓజి విడుదల ఎప్పుడు, తమన్ పాటలు ఎలా ఉంటాయో, హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటుందా, ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్ హరీష్ శంకర్ ఏమైనా ఇస్తాడా అంటూ ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫలితాలు వచ్చినప్పటి నుంచి దొరుకుతున్న కిక్ అంతా ఇంతా కాదు.
చిరంజీవి ఇంటికి వెళ్లి సంబరం చేసుకోవడం దగ్గరి నుంచి ప్రధాని మోదీ హాజరైన సీఎం చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం దాకా వాళ్లకు కావాల్సిన ఎన్నో హై మూమెంట్స్ దొరికాయి. వీటికి తోడు అభిమానులు సొంతంగా చేసుకున్న ఎడిట్ వీడియోలు తెగ వైరలవుతున్నాయి.
నిన్నటి నుంచి ఏపీ కొత్త ప్రభుత్వం అసెంబ్లీ కొలువు తీరింది. ఇలాంటి వాటికి సహజంగానే దూరంగా ఉండే సగటు యువత ఈ రోజు మాత్రం సభ కార్యకలాపాలను లైవ్ లో చూసేందుకు సిద్ధమై ఫోన్లు, టీవీల ముందు కాపు కాచుకుని కూర్చుంది.
కారణం పవన్ కళ్యాణ్ ని శాసనసభ గేటు కూడా తాకనివ్వమని గతంలో పలువురు వైసిపి నేతలు చేసిన సవాల్ కు సరైన సమాధానంగా తమ హీరో గర్వంగా అడుగు పెట్టడమే కాక ఉప ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు తీసుకోవడం నిన్నంతా తిరిగేసింది. ఈ రోజు అయ్యన్నపాత్రుడుని స్పీకర్ గా ఎంచుకున్నాక పవన్ మొదటిసారి ప్రసంగించడంతో ఆసక్తి నెలకొంది.
మాజీ సిఎం జగన్ ని ఉద్దేశించి వాళ్ళ పదకొండు ఎమ్మెల్యేలు పారిపోయారని, విజయం స్వీకరించి ఓటమిని మాత్రం వద్దనుకోవడం పట్ల పవన్ వేసిన సెటైర్లు బాగా పేలాయి. అంతేకాదు స్పీకర్ అయ్యన్నపాత్రుడుని స్కూల్ మాస్టరుతో పోలుస్తూ ఎవరినైనా మందలించాలన్నా అతి చేసే వైవిపి నాయకులు సభలో లేరంటూ పంచులు వేయడం నవ్వులు పూయించింది.
మొత్తానికి గత పద్దెనిమిది రోజులుగా జనసేనాని గెలుపుని ఆస్వాదిస్తున్న అభిమానులకు అసెంబ్లీలో జరుగుతున్న క్లీన్ అండ్ హెల్తీ సినిమా వాళ్లకు కావాల్సిన ఆనందంతో పాటు ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచి పెడుతోంద.
This post was last modified on June 22, 2024 6:39 pm
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన…
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…
మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…
ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…