Movie News

మహేష్ కన్నా ముందు అడవులకు అఖిల్

గత ఏడాది ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలు కానేలేదు. అదిగో ఇదిగో అంటున్నారు తప్పించి దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.

యువి క్రియేషన్స్ బ్యానర్ లో అదే సంస్థలో పని చేసిన అనిల్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ గ్రాండియర్ ని ప్లాన్ చేశారు. దీని కోసమే ప్రత్యేకంగా జుత్తు, గెడ్డం విపరీతంగా పెంచేసిన అఖిల్ ఈసారి ఎలాగైనా సరే గురి తప్పకూడదనే సంకల్పంతో ఎంత ఆలస్యమవుతున్నా సరే ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ దీనికి మహేష్ బాబుకి కనెక్షన్ ఏంటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం.

ఈ ప్రెస్టీజియస్ ప్యాన్ ఇండియా మూవీలో అఖిల్ పదకొండో శతాబ్దానికి చెందిన ఒక అటవీ వీరుడిగా కనిపిస్తాడని సమాచారం. అంటే మొత్తం అడవి బ్యాక్ డ్రాపన్నమాట. అపకలిప్టో తరహాలో మొత్తం వేరే ప్రపంచంలో కథ సాగుతుందని తెలిసింది.

గతం వర్తమానాన్ని ముడిపెడుతూ టైం ట్రావెల్ లాంటివి లేకుండా కేవలం అప్పటి ఒక వీరుడి గాథని మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తారట. ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలు బోలెడు ఉంటాయి. రాజమౌళి ప్లాన్ చేసుకున్న మహేష్ బాబు 29లోనూ అటవీ నేపధ్యమున్న సంగతి తెలిసిందే. ఇండియానా జోన్స్ తరహాలో క్యారెక్టరైజేషన్ రాసుకున్నారు.

అంటే రెండు సినిమాల్లోనూ కనిపించే సారూప్యత ఆడవన్న మాట. అయితే మహేష్ కన్నా ముందు అఖిల్ డీప్ ఫారెస్ట్ లోకి అడుగు పెట్టేలా ఉన్నాడు. సెట్స్ లో కాకుండా నిజమైన వాతావరణంలో తీసేందుకు అనిల్ కుమార్ రెడీ అవుతున్నట్టు తెలిసింది.

షూటింగ్ మొదలుపెట్టడంలో కొంత ఆలస్యం జరిగినా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా యువి మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. వీళ్ళ నిర్మాణంలోనే రూపొందుతున్న విశ్వంభర ఆగస్ట్ కల్లా చిత్రీకరణ పూర్తి చేసుకోనుండటంతో పూర్తి ఫోకస్ అఖిల్ 6 మీద పెట్టబోతున్నారు. హీరోయిన్, సాంకేతిక వర్గం తదితర వివరాలు త్వరలో తెలియనున్నాయి.

This post was last modified on June 24, 2024 9:34 am

Share
Show comments
Published by
Satya
Tags: AkhilMahesh

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

45 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago