ఆగస్టు 15 అంటే ఎంతో ఆకర్షణీయమైన డేట్. ప్రతి ఏడాది ఆ వీకెండ్లో భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. ఈసారి పుష్ప-2 లాంటి క్రేజీ మూవీ ఆ తేదీకి షెడ్యూల్ కావడంతో భారతీయ సినీ ప్రియులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో ఆ చిత్రానికి బంపర్ క్రేజ్ ఉండడంతో ఇండిపెండెన్స్ డే వీకెండ్లో వసూళ్ల మోత మోగిపోతుందని భావించారు. కానీ పుష్ప-2 అనూహ్యంగా ఆ డేట్ నుంచి తప్పుకుని డిసెంబరుకు వెళ్లిపోయింది.
మరి ఆగస్టు 15ను ఏ భారీ చిత్రం క్యాష్ చేసుకోవడానికి చూస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా.. ఇప్పటిదాకా అయితే ఏ పెద్ద సినిమా ఆ డేట్ను వాడుకునే ప్రయత్నం చేయలేదు. తెలుగు నుంచి రామ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ మాత్రమే ఆగస్టు 15కు షెడ్యూల్ అయింది.
ఐతే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన భారతీయుడు-2కు ఆగస్టు 15 డేట్ తీసుకుంటే బాగా కలిసి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇండియన్-2 టీం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అన్నీ పరిశీలించాక ఇండియన్-2 టీం ఆగస్టు 15 రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గింది. ఇంతకుముందు ప్రకటించినట్లే జులై 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకోసం ఈ నెల 21న యుఎస్ ప్రిమియర్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కూడా ధ్రువీకరించింది.
అంటే ఇండియన్-2 మరోసారి వాయిదా పడట్లేదని అర్థం. జూన్ 12కు అనుకున్న ఈ చిత్రాన్ని నెల రోజులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇంకోసారి వాయిదా వేస్తే జనాల్లో ఆసక్తి తగ్గిపోతుందని.. ఈ చిత్రం ఆలస్యం అయ్యే కొద్దీ గేమ్ చేంజర్ మీద కూడా ఆ ప్రభావం పడుతుందని భావించి అనుకున్న ప్రకారమే జులై 12న భారతీయుడు-2ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on June 20, 2024 10:57 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…