‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అతను అప్పగికే ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా అది వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. రెండో సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత రెండేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు చేశాడు కార్తికేయ. కానీ ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతేనేం అతడికి అవకాశాలకేమీ లోటు లేదు.
గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా చేస్తున్న అతను.. తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘వాలిమై’లోనూ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అవి కాక సోమవారం కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దాని పేరు వెల్లడించలేదు కానీ.. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో జనాల దృష్టిని ఆకర్షించారు.
కార్తికేయ ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నాడని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఒక కేసు తాలూకు ఫైల్లో వివరాలు నమోదు చేసినట్లుగా.. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి పోస్టర్లో వెల్లడించారు. ‘మిషన్ టైటిల్’ అన్న చోట ఖాళీ ఉంచడం ద్వారా ఇంకా ఈ సినిమాకు పేరు పెట్టలేదని చెప్పారు.
అలాగే కేస్ ఆఫీసర్ అనే చోట ఖాళీ ఉంచడం ద్వారా హీరో పాత్ర ఇప్పుడే వెల్లడించబోమని సంకేతాలిచ్చారు. మరో పేరు కార్తికేయ గుమ్మకుండ అని, అతడి పుట్టిన రోజు 21 సెప్టెంబరు అని వెల్లడించారు. ఆఫీసర్స్ ఆన్ ఫైల్ అని కింద నిర్మాత రామారెడ్డి, దర్శకుడు శ్రీ సరిపల్లిల పేర్లు వేశారు. ‘స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్’ అని ట్యాగ్ కూడా వేసి ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని చెప్పకనే చెప్పారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం సమకూర్చనున్నాడు. దీంతో పాటుగా ఈ రోజు రిలీజైన ‘చావు కబురు చల్లగా’ టీజర్ కూడా సరదాగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
This post was last modified on September 21, 2020 5:16 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…