‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అతను అప్పగికే ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా అది వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. రెండో సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత రెండేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు చేశాడు కార్తికేయ. కానీ ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతేనేం అతడికి అవకాశాలకేమీ లోటు లేదు.
గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా చేస్తున్న అతను.. తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘వాలిమై’లోనూ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అవి కాక సోమవారం కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దాని పేరు వెల్లడించలేదు కానీ.. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో జనాల దృష్టిని ఆకర్షించారు.
కార్తికేయ ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నాడని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఒక కేసు తాలూకు ఫైల్లో వివరాలు నమోదు చేసినట్లుగా.. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి పోస్టర్లో వెల్లడించారు. ‘మిషన్ టైటిల్’ అన్న చోట ఖాళీ ఉంచడం ద్వారా ఇంకా ఈ సినిమాకు పేరు పెట్టలేదని చెప్పారు.
అలాగే కేస్ ఆఫీసర్ అనే చోట ఖాళీ ఉంచడం ద్వారా హీరో పాత్ర ఇప్పుడే వెల్లడించబోమని సంకేతాలిచ్చారు. మరో పేరు కార్తికేయ గుమ్మకుండ అని, అతడి పుట్టిన రోజు 21 సెప్టెంబరు అని వెల్లడించారు. ఆఫీసర్స్ ఆన్ ఫైల్ అని కింద నిర్మాత రామారెడ్డి, దర్శకుడు శ్రీ సరిపల్లిల పేర్లు వేశారు. ‘స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్’ అని ట్యాగ్ కూడా వేసి ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని చెప్పకనే చెప్పారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం సమకూర్చనున్నాడు. దీంతో పాటుగా ఈ రోజు రిలీజైన ‘చావు కబురు చల్లగా’ టీజర్ కూడా సరదాగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
This post was last modified on September 21, 2020 5:16 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…