‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరపైకి దూసుకొచ్చిన యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అతను అప్పగికే ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా అది వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. రెండో సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత రెండేళ్ల వ్యవధిలో నాలుగు సినిమాలు చేశాడు కార్తికేయ. కానీ ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతేనేం అతడికి అవకాశాలకేమీ లోటు లేదు.
గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమా చేస్తున్న అతను.. తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘వాలిమై’లోనూ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అవి కాక సోమవారం కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దాని పేరు వెల్లడించలేదు కానీ.. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్తో జనాల దృష్టిని ఆకర్షించారు.
కార్తికేయ ఈ సినిమాలో పోలీస్ పాత్ర చేస్తున్నాడని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఒక కేసు తాలూకు ఫైల్లో వివరాలు నమోదు చేసినట్లుగా.. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి పోస్టర్లో వెల్లడించారు. ‘మిషన్ టైటిల్’ అన్న చోట ఖాళీ ఉంచడం ద్వారా ఇంకా ఈ సినిమాకు పేరు పెట్టలేదని చెప్పారు.
అలాగే కేస్ ఆఫీసర్ అనే చోట ఖాళీ ఉంచడం ద్వారా హీరో పాత్ర ఇప్పుడే వెల్లడించబోమని సంకేతాలిచ్చారు. మరో పేరు కార్తికేయ గుమ్మకుండ అని, అతడి పుట్టిన రోజు 21 సెప్టెంబరు అని వెల్లడించారు. ఆఫీసర్స్ ఆన్ ఫైల్ అని కింద నిర్మాత రామారెడ్డి, దర్శకుడు శ్రీ సరిపల్లిల పేర్లు వేశారు. ‘స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్’ అని ట్యాగ్ కూడా వేసి ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని చెప్పకనే చెప్పారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం సమకూర్చనున్నాడు. దీంతో పాటుగా ఈ రోజు రిలీజైన ‘చావు కబురు చల్లగా’ టీజర్ కూడా సరదాగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
This post was last modified on September 21, 2020 5:16 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…