‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమా ఏదనే విషయంలో ఎంతకీ ఒక క్లారిటీ రావట్లేదు. వేణు శ్రీరామ్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, అట్లీ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి గత కొన్నేళ్లలో. వేణు శ్రీరామ్తో అనుకున్న ‘ఐకాన్’ గురించి అధికారికంగా ప్రకటించారు కానీ తర్వాత దాని గురించి చర్చే లేదు. కొరటాల శివ సినిమా కూడా అనౌన్స్మెంట్ తర్వాాత అడ్రస్ లేకుండా పోయింది.
ఇక ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డిలతో చర్చలైతే జరిగాయి కానీ.. సినిమా లాక్ కాలేదు. చివరికి అట్లీ దర్శకత్వంలో నటించడానికి బన్నీ సూత్రప్రాయంగా అంగీకరించాడని.. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. సన్ పిక్చర్స్తో కలిసి అల్లు అర్జున్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
మరి అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమా ఎందుకు ముందుకు కదలట్లేదు అని సందేహం రావడం ఖాయం. బన్నీ కథ రెడీ అయ్యాక సంతృప్తి చెందక యుటర్న్ తీసుకోవడం మామూలే కదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం దర్శకుడి పారితోషకం విషయంలో అభ్యంతరాలు తలెత్తి ఆగినట్లు తెలుస్తోంది. అట్లీ ఏకంగా రూ.80 కోట్ల పారితోషకం అడిగాడట ఈ చిత్రానికి. తమిళంలో అట్లీ తీసిన సినిమాలన్నీ బ్లాక్బస్టర్లే. హిందీలోనూ గత ఏఢాది ‘జవాన్’ రూపంలో మరో బ్లాక్బస్టర్ ఇచ్చాడు. అట్లీ సినిమాలు రొటీన్ అనిపించినా.. కమర్షియల్గా బాగా వర్కవుట్ అవుతాయి. అందుకే తనకు మాంచి డిమాండ్ ఉంది.
ఈ నేపథ్యంలోనే అతను రూ.80 కోట్లు పారితోషకం డిమాండ్ చేయగా.. దర్శకుడికే ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ ప్రాజెక్టును వర్కవుట్ చేయడం కష్టమని అల్లు అరవింద్ వెనక్కి తగ్గారట. అందుకే ఈ సినిమా క్యాన్సిల్ అయిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…