ఒక స్టార్ హీరో తన అభిమానిని హత్య చేసిన కేసులో చిక్కుకున్న విచిత్ర ఉదంతం ఇప్పుడు కన్నడ నాట సంచలనం రేపుతోంది. కన్నడ టాప్ స్టార్లలో ఒకడైన దర్శన్.. తన అభిమానే అయిన రేణుక స్వామి హత్య కేసులో ఎ-2గా అభియోగాలు ఎదుర్కొంటూ పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
దర్శన్ తన భార్య విజయలక్ష్మికి దూరంగా ఉంటూ.. పవిత్ర గౌడ అనే నటితో చాలా ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉండడం నచ్చని రేణుక స్వామి అనే దర్శన్ అభిమాని.. పవిత్రను సోషల్ మీడియా వేదికగా దూషించడం, ఆమెకు అసభ్య సందేశాలు పంపడంతో అతణ్ని లక్ష్యంగా చేసుకున్న దర్శన్ అండ్ కో తనను చిత్ర హింసలు పెట్టి ఏకంగా హత్యే చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. రేణుకస్వామికి కరెంట్ షాక్ ఇవ్వడంతో పాటు శాకాహారి అయిన అతడికి నాన్ వెజ్ తినిపించి మరీ హింసించినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెల్లడైంది.
ఈ హత్యోదంతంతో దర్శన్లోని నెగెటివ్ కోణం బాగా హైలైట్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శన్కు సంబంధించిన పాత వివాదాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. గతంలో అతను భార్య మీద దాడి చేసి గృహ హింస కేసు ఎదుర్కొన్నాడు. ఈ కేసులో రెండు వారాల పాటు జైల్లో కూడా ఉన్నాడు. అలాగే ఒక హోటల్లో వెయిటర్ మీద దాడి చేశాడు. అలాగే మద్యం తాగి ఒక యాక్సిడెంట్ కూడా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అలాగే అరుదైన పక్షులను అక్రమంగా బంధించి ఉంచాడనే కేసు.. ఓ మహిళపై దాడి కేసు.. ఇలా దర్శన్ వివాదాస్పద వ్యవహారాల జాబితా చాలా పెద్దదే.
ఐతే వాటన్నింటి నుంచి సులువుగానే బయటపడ్డ దర్శన్.. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులకు చిక్కాడు. మరి ఈ కేసు నుంచి కూడా ఇంతకుముందులాగే బయటికి వచ్చేస్తాడా.. లేక శిక్ష అనుభవిస్తాడా అన్నది చూడాలి.
This post was last modified on June 18, 2024 8:08 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…