పవన్ కళ్యాణ్ పేరు ముందు ఇప్పుడు ఎవ్వరూ పవర్ స్టార్ అని పెట్టట్లేదు. ఆరు నెలల పాటు అందరూ జనసేనాని అనే సంబోధించారు. ఇక రెండు వారాల కిందట ఆయన పేరు ముందు ఎమ్మెల్యే అని వచ్చి చేరింది. తాజాగా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయారు. కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కాయి. దీంతో ఆయనపై ఎంత బాధ్యత పెరిగింది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పవన్ను ఇకపై ఎవ్వరూ పార్ట్ టైం పొలిటీషియన్ అనే పరిస్థితి లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనదైన ముద్ర వేయబోతున్న నాయకుడు అవుతారనడంలో సందేహం లేదు. ఐతే ఇప్పుడు పవన్కు ఓ సంకట పరిస్థితి ఏర్పడింది. ఆయన సినిమాలను పూర్తిగా విడిచిపెట్టే పరిస్థితి లేదు. కనీసం చేతిలో ఉన్న ప్రాజెక్టులైనా పూర్తి చేసి తీరాల్సిందే. అందుకోసం ఎంత టైం పెడతారు.. ఎప్పట్లోపు వాటిని పూర్తి చేస్తారు అన్నది ఆసక్తికరం.
పవన్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఆయన ఒకేసారి కాకుండా వచ్చే రెండేళ్లలో వీలున్నపుడల్లా డేట్లు కేటాయిస్తూ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. ముందు అనుకున్న ప్రకారం అయితే ‘ఓజీ’నే ముందు పూర్తి చేయాలి. కానీ తర్వాత ఆలోచన మారిపోయింది. ముందుగా ఆయన ‘హరిహర వీరమల్లు’ కోసం కాల్ షీట్స్ ఇస్తున్నారట. వచ్చే నెలలోనే షూట్ ఉండొచ్చని అంటున్నారు. దాన్ని పూర్తి చేశాకే వేరే సినిమా గురించి ఆలోచిస్తారట.
ఎన్నికల ముందు అయితే.. ఫలితాలు వచ్చాక ఒక ఆరు నెలలు టైం తీసుకుని వరుసబెట్టి సినిమాలన్నీ పూర్తి చేసేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్.. పైగా కీలక మంత్రిత్వ శాఖలను చేతిలో పెట్టుకుని ఆరు నెలలు వరుసగా గ్యాప్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అప్పుడప్పుడు డేట్లు ఇచ్చి రాబోయే రెండేళ్లలో అన్ని సినిమాలనూ పూర్తి చేయాలనుకుంటున్నారు. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం హరిహర వీరమల్లు రెండో పార్ట్ చేయడం కూడా కష్టమే అంటున్నారు.
This post was last modified on June 17, 2024 7:13 pm
ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్ల క్రేజీ…
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు…
ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…
వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో…
కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు…