ఒక మంచి క్రైమ్ వెబ్ సిరీస్ కు సరిపడా కంటెంట్ కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసులో దొరుకుతోంది. స్వయానా తన అభిమాని హత్య కేసులో చిక్కుకున్న ఈ కాటేరా కథానాయకుడు అంత సులభంగా బయటికి వచ్చేలా కనిపించడం లేదు.
తాజాగా పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో రేణుకస్వామిని తొలుత కిడ్నాప్ చేసిన సంగతి తనకు తెలియదని, సరే ఎలాగూ వచ్చాడు కదాని పవిత్రని తీసుకెళ్లి మరోసారి చేయొద్దని వార్నింగ్ ఇవ్వడం తప్ప ఏం చేయలేదని నమ్మబలికినట్టు తెలిసింది. అంతేకాదు వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళమని డబ్బులు కూడా ఇచ్చినట్టు పేర్కొన్నాడు. ఇదంత గుడ్డిగా నమ్మేలా లేదు.
క్రమంగా మరిన్ని భీతిగొలిపే నిజాలు బయటికి వస్తున్నాయి. శాండల్ వుడ్ మీడియా ప్రకారం గత వారం రేణుకస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకి ఎత్తుకొచ్చారు.
రాత్రి 7 గంటలకు దర్శన్ అభిమాని కి చెందిన షెడ్డుకి తీసుకొస్తే మరుసటి రోజు తెల్లవార్జుఝామున 3 గంటల వరకు చిత్రహింసలు పెట్టారట. పవిత్ర గౌడ చెప్పుతో అతన్ని కొడితే పలు ఆయుధాలతో దర్శన్, ఫ్యాన్స్ దారుణంగా గాయపరిచినట్టు ఆధారాలు దొరికాయట.
గోడకేసి బాదాక చనిపోయాడని తెలిసి ఇదంతా మేనేజ్ చేయడానికి పవన్ అనే వ్యక్తికి 30 లక్షలు ఇచ్చినట్టు కథనాలు వస్తున్నాయి. ఇదే సొమ్ముని వినయ్ అనే వ్యక్తి గ్యాంగుకి నేరం మోయడానికి లంచంగా ఇచ్చారట.
ఇదంతా జరిగే క్రమంలో ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ సహాయం చేసినట్టు వినిపిస్తోంది. దర్శన్ ఇంత ఘోరానికి పాల్పడినా కొందరు అబిమానులు సమర్ధిస్తూ నిరసనలు చేయడం పట్ల ఇప్పటికే కర్ణాటకలో ఆందోళన వ్యక్తమవుతోంది.
పవిత్ర గౌడ, దర్శన్ తో సహా మొత్తం 15 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. హీరో మాత్రం నేనేం చేయలేదని లాయర్ సలహా మేరకు సినిమా ఫక్కీలో నటిస్తున్నప్పటికీ వ్యవహారం మాత్రం అతన్ని పీకల్లోతులోకి దింపేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే దర్శన్ హీరోగా సెట్స్ మీదున్న సినిమాల్లో దాదాపు వంద కోట్లు బ్లాక్ అయినట్టు సమాచారం. పాపం నిర్మాతలు.
This post was last modified on June 16, 2024 3:14 pm
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సినిమాలకు గుర్తింపు ఇచ్చే అవార్డుగా పేరున్న ఆస్కార్ విజేతలను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఉందన్న…
కూటమి సర్కారు కొలువు దీరింది. మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల సమయంలో సీట్లు దక్కని నాయకులు, సీట్లు…
ఏపీ రాజధానిగా అమరావతి స్థిరపడింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి.. అమరావతికి ఢోకాలేదు. పనులు కూడా వేగంగా జరుగుతాయి.…
నిన్న విడుదలైన భారతీయుడు 2 ట్రైలర్ మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఊహించని విధంగా అటు తమిళంలోనూ అసంతృప్తి చెలరేగడం…
అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులు కూడా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి విడుదల…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి 70 వేల మెజారిటీతో విజయం దక్కించుకున్న…