ఎప్పుడో ఆరేడు నెలల తర్వాత రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్నా ఎలాంటి పోటీ, సమస్య రాదనే గ్యారెంటీ లేని పరిస్థితులు ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్నాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలకు ఇదో ప్రాణ సంకటంగా మారింది.
గత ఏడాది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ హఠాత్తుగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు వెళ్లిపోవడం ఎన్ని సినిమాలను ప్రభావితం చేసిందో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. కొన్నింటి ఓపెనింగ్స్ దెబ్బ తింటే మరికొన్ని టైమింగ్ మిస్సయిపోయి ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిదే సిచువేషన్ 2024 డిసెంబర్ లోనూ రిపీటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ముందు ప్రకటించిన దాని ప్రకారం డిసెంబర్ 20న నాగ చైతన్య తండేల్, నితిన్ రాబిన్ హుడ్ అధికారికంగా రావాలి. పోటీ అయినప్పటికీ రెండు వేర్వేరు జానర్లు కాబట్టి ఆయా దర్శక నిర్మాతలు ఓకే అనుకున్నారు.
ఇప్పుడు చూస్తే ఆగస్ట్ నుంచి తప్పుకోబోతున్న పుష్ప 2 ది రూల్ ని మొదటి భాగంలాగే డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఒకవేళ నిజంగా అనుకుంటే తండేల్ నిర్మాత గీతా ఆర్ట్స్ కాబట్టి సులభంగా తప్పుకుంటుంది. రాబిన్ హుద్ నిర్మాతలు మైత్రి వాళ్లే కనక నితిన్ మూవీని ఇంకో తేదీకి మార్చేస్తారు.
అప్పుడు తండేల్, రాబిన్ హుడ్ ముందే రావడమో లేక వచ్చే సంవత్సరానికి షిఫ్ట్ అవ్వడమో చేయాలి. ఒకవేళ పుష్ప కనక అక్టోబర్ ఆప్షన్ చూస్తే గండం తప్పిపోయిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ని అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసే దిశగా నిర్మాత దిల్ రాజు దర్శకుడు శంకర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట.
ఎలా చూసుకున్నా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఎవరో ఒకరు ఏడాది చివర్లో వచ్చేలా ఉన్నారు. రాను రాను ప్యాన్ ఇండియా సినిమా తేదీలు అనిశ్చితికి మారుపేరుగా నిలుస్తున్నాయి. ఇదో అంతులేని కథగా మారిపోతోంది.
This post was last modified on June 16, 2024 3:03 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…