ఒక పది రోజుల క్రితం వరకు మహారాజ పేరుతో విజయ్ సేతుపతి ఒక సినిమా చేశాడనే సంగతే తెలుగు ప్రేక్షకులకు తెలియదు. సోలో హీరోగా తన మార్కెట్ ఇక్కడ జీరో కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్స్ సైతం మీడియాలో అంతగా హైలైట్ కాలేదు.
కట్ చేస్తే డబ్బింగ్ హక్కులు కొనేయడం, రెండు భాషల్లో సమాంతరంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగిపోయాయి. టైం చాలా తక్కువగా ఉన్నప్పటికీ విజయ్ సేతుపతి ఆలస్యం చేయకుండా హైదరాబాద్ వచ్చి, మూడు నాలుగు రోజులు మకాం వేసి టీమ్ అడిగిన ప్రమోషన్స్ అన్నింటిలో భాగమై తన మీద దృష్టి పడేలా చేసుకున్నాడు.
అతని నమ్మకం నిజమయ్యింది. నిన్న విడుదలైన మహారాజకు ఆడియన్స్ మద్దతు దొరికింది. చాలా సీరియస్ కాన్సెప్ట్ అయినప్పటికీ దర్శకుడు నితిలన్ స్క్రీన్ ప్లేకి జనాలు ఫిదా అయ్యారు. పాజిటివ్ టాక్ క్రమంగా సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ లెవెల్ లో సాధారణ జనాలకు రీచ్ అవుతోంది.
నిన్న మార్నింగ్ షోలకు పలుచగా కనిపించిన పబ్లిక్ సాయంత్రానికి కౌంట్ పెంచేశారు. మెయిన్ థియేటర్లు దాదాపుగా ఫుల్స్ పడ్డాయి. శని ఆదివారాలు ఖచ్చితంగా భారీ ఫిగర్లు నమోదవుతాయనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. మాస్ ఆడియన్స్ సైతం మెల్లగా మొగ్గు చూపడం మొదలుపెట్టారు.
యాభై సినిమాగా విజయ్ సేతుపతికి ఇది కీలకం కావడంతో పబ్లిసిటీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడే ఇలా ఉంటే ఇక తమిళనాడులో చెప్పేదేముంది.
ఈ ఏడాది అతి పెద్ద హిట్స్ లో ఇది ఒకటిగా నిలవడం ఖాయమని చెబుతున్నారు. గత రెండు మూడు నెలలుగా కోలీవుడ్ లో సరైన హిట్ మూవీ పడలేదు. అందుకే గిల్లి, గజిని లాంటి పాత రీ రిలీజులనే జనం ఎగబడి చూశారు. ఇప్పుడు మహారాజ ఆ కొరత తీరుస్తుందని బయ్యర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కల్కి 2898 ఏడి వచ్చే దాకా రెండు వారాల గ్యాప్ ఉంది కాబట్టి అప్పటిరాజా మహారాజ సింహాసనం నిలబెట్టుకుంటే సరి.
This post was last modified on June 15, 2024 1:01 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…