ఒక పెద్ద సినిమా వాయిదా పడుతుంటే.. అది చాలా ఆశ్చర్యకరమైన విషయంలా ఉండేది ఒకప్పుడు. కానీ కరోనా పుణ్యమా అని ఈ వాయిదాల పర్వం చాలా సాధారణమైన విషయంలా మారిపోయింది. ఒకసారి డేట్ ప్రకటించాక దానికి కట్టుబడి రిలీజయ్యే సినిమాలు అరుదైపోతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ ఆలస్యం అయింది అనుకుంటున్న పుష్ప-2 సినిమా ఆగస్టు 15కు రాకపోవచ్చన్న వార్త కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ వార్త రూమరనే అనుకున్నారు.
కానీ టీం నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పుష్ప-2 వాయిదా పడడం పక్కా. సినిమా కొత్త షెడ్యూల్ను రిలీజ్ డేట్ను దాటి కొన్ని రోజుల వరకు ఎక్స్టెండ్ చేశారన్నది తాజా సమాచారం. అంటే ఆగస్టు 15 నాటికి షూటింగ్ కూడా అవ్వదన్నమాట. షూటింగ్ స్టేటస్ అలా ఉన్నపుడు రిలీజ్ డేట్కు ఎలా కట్టుబడతారు?
పుష్ప-2 టీం సభ్యుల సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా నెలా రెండు నెలలకు పరిమితం కాదట. సినిమా నిడివితో పోలిస్తే రెట్టింపు రష్ ఉంటుందని.. దాన్ని ఎడిట్ చేయడం.. అన్ని భాషలకు కలిపి పోస్ట్ ప్రొడక్షన్ చేయడం.. సీజీ వర్క్ అంతా ఒక కొలిక్కి తేవడం.. ఈ వ్యవహారాలన్నీ చాలా టైం తీసుకునేవే. కాబట్టి ఆగస్టు 15 నుంచి ఇంకో ఐదు నెలలైనా పడుతుంది ఫస్ట్ కాపీ తీయడానికి. కాబట్టి ఆగస్టు మిస్ అయితే సెప్టెంబరు లేదా అక్టోబరు అనుకోవడానికి కూడా లేదు.
బహుశా పుష్ప-1ను రిలీజ్ చేసినట్లే పుష్ప-2ను డిసెంబరులో విడుదల చేయొచ్చన్నది చిత్ర వర్గాల అంచనా. అదే జరిగితే డిసెంబరులో రావాల్సిన చాలా సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకోక తప్పదు. పాన్ ఇండియా స్థాయిలో మార్పులు చేర్పులు అనివార్యం. దీని వల్ల ట్రేడ్ వర్గాల్లో ఒక అలజడి రేగడం ఖాయం.
This post was last modified on June 15, 2024 7:25 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…