మాస్ రాజా రవితేజ కొన్నేళ్ల కిందట ఓ తమిళ హిట్ మూవీ మీద అమితమైన ఆసక్తి ప్రదర్శించాడు. దాని రీమేక్లో నటించాలని అనుకున్నాడు. ఆ సినిమానే.. బోగన్. జయం రవి, హన్సిక, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. లక్ష్మణ్ అనే దర్శకుడు దీన్ని రూపొందించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి.
దర్శకుడు లక్ష్మణ్.. రవితేజతో కొన్ని సిట్టింగ్స్ కూడా వేశాడు. త్వరలోనే ఈ రీమేక్ పట్టాలెక్కడం పక్కా అనుకున్న తరుణంలో ఉన్నట్లుండి రవితేజ వెనక్కి తగ్గాడు. కొన్ని నెలల పాటు రవితేజతో ట్రావెల్ అయి.. చివరికి సినిమా క్యాన్సిల్ అయ్యేసరికి లక్ష్మణ్ హర్టయ్యాడు. తమిళ మీడియాలో దీనిపై అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు.
బోగన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్న నిర్మాత రామ్ తాళ్లూరి. అది వర్కవుట్ కాక రవితేజతో తర్వాత నేల టిక్కెట్టు తీశాడు. అది డిజాస్టర్ కాగా.. మళ్లీ ఆ హీరోతోనే డిస్కో రాజా చేశాడు. అదీ డిజాస్టరే. వీటి బదులు బోగన్ రీమేక్ చేసి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదేమో.
ఐతే అప్పట్లో రీమేక్ హక్కులు తీసుకున్న వేస్టయిపోకూడదనో ఏమో.. రామ్ తాళ్లూరి ఇప్పుడు ఆ చిత్రాన్ని అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం విశేషం. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. బోగన్ పేరుతోనే ఈ సినిమా త్వరలోనే తెలుగులో రిలీజవుతుందని ప్రకటించారు. బహుశా ఓటీటీలో డబ్బింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆహాలో బోగన్ తెలుగువెర్షన్ రిలీజ్ చేస్తుండొచ్చని భావిస్తున్నారు.
This post was last modified on September 21, 2020 2:29 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…