మాస్ రాజా రవితేజ కొన్నేళ్ల కిందట ఓ తమిళ హిట్ మూవీ మీద అమితమైన ఆసక్తి ప్రదర్శించాడు. దాని రీమేక్లో నటించాలని అనుకున్నాడు. ఆ సినిమానే.. బోగన్. జయం రవి, హన్సిక, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. లక్ష్మణ్ అనే దర్శకుడు దీన్ని రూపొందించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి.
దర్శకుడు లక్ష్మణ్.. రవితేజతో కొన్ని సిట్టింగ్స్ కూడా వేశాడు. త్వరలోనే ఈ రీమేక్ పట్టాలెక్కడం పక్కా అనుకున్న తరుణంలో ఉన్నట్లుండి రవితేజ వెనక్కి తగ్గాడు. కొన్ని నెలల పాటు రవితేజతో ట్రావెల్ అయి.. చివరికి సినిమా క్యాన్సిల్ అయ్యేసరికి లక్ష్మణ్ హర్టయ్యాడు. తమిళ మీడియాలో దీనిపై అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు.
బోగన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్న నిర్మాత రామ్ తాళ్లూరి. అది వర్కవుట్ కాక రవితేజతో తర్వాత నేల టిక్కెట్టు తీశాడు. అది డిజాస్టర్ కాగా.. మళ్లీ ఆ హీరోతోనే డిస్కో రాజా చేశాడు. అదీ డిజాస్టరే. వీటి బదులు బోగన్ రీమేక్ చేసి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేదేమో.
ఐతే అప్పట్లో రీమేక్ హక్కులు తీసుకున్న వేస్టయిపోకూడదనో ఏమో.. రామ్ తాళ్లూరి ఇప్పుడు ఆ చిత్రాన్ని అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం విశేషం. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. బోగన్ పేరుతోనే ఈ సినిమా త్వరలోనే తెలుగులో రిలీజవుతుందని ప్రకటించారు. బహుశా ఓటీటీలో డబ్బింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆహాలో బోగన్ తెలుగువెర్షన్ రిలీజ్ చేస్తుండొచ్చని భావిస్తున్నారు.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…