Movie News

ర‌వితేజ చేయాల్సిన రీమేక్.. చివ‌రికి

మాస్ రాజా ర‌వితేజ కొన్నేళ్ల కింద‌ట ఓ త‌మిళ హిట్ మూవీ మీద అమిత‌మైన ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించాడు. దాని రీమేక్‌లో న‌టించాల‌ని అనుకున్నాడు. ఆ సినిమానే.. బోగ‌న్. జ‌యం ర‌వి, హ‌న్సిక‌, అర‌వింద్ స్వామి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్ర‌మిది. ల‌క్ష్మ‌ణ్ అనే ద‌ర్శ‌కుడు దీన్ని రూపొందించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే జ‌రిగాయి.

ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌.. ర‌వితేజ‌తో కొన్ని సిట్టింగ్స్ కూడా వేశాడు. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ ప‌ట్టాలెక్క‌డం ప‌క్కా అనుకున్న త‌రుణంలో ఉన్న‌ట్లుండి ర‌వితేజ వెన‌క్కి త‌గ్గాడు. కొన్ని నెల‌ల పాటు ర‌వితేజ‌తో ట్రావెల్ అయి.. చివ‌రికి సినిమా క్యాన్సిల్ అయ్యేస‌రికి లక్ష్మ‌ణ్ హ‌ర్ట‌య్యాడు. త‌మిళ మీడియాలో దీనిపై అసంతృప్తిని కూడా వ్య‌క్తం చేశాడు.

బోగ‌న్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్న నిర్మాత రామ్ తాళ్లూరి. అది వ‌ర్క‌వుట్ కాక ర‌వితేజ‌తో త‌ర్వాత నేల టిక్కెట్టు తీశాడు. అది డిజాస్ట‌ర్ కాగా.. మ‌ళ్లీ ఆ హీరోతోనే డిస్కో రాజా చేశాడు. అదీ డిజాస్ట‌రే. వీటి బ‌దులు బోగ‌న్ రీమేక్ చేసి ఉంటే ఫ‌లితం మెరుగ్గా ఉండేదేమో.

ఐతే అప్ప‌ట్లో రీమేక్ హ‌క్కులు తీసుకున్న వేస్ట‌యిపోకూడ‌ద‌నో ఏమో.. రామ్ తాళ్లూరి ఇప్పుడు ఆ చిత్రాన్ని అనువాద రూపంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తుండ‌టం విశేషం. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న కూడా చేశారు. బోగ‌న్ పేరుతోనే ఈ సినిమా త్వ‌ర‌లోనే తెలుగులో రిలీజ‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. బ‌హుశా ఓటీటీలో డ‌బ్బింగ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన ఆహాలో బోగ‌న్ తెలుగువెర్ష‌న్ రిలీజ్ చేస్తుండొచ్చ‌ని భావిస్తున్నారు.

This post was last modified on September 21, 2020 2:29 pm

Share

Recent Posts

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

14 minutes ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

2 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

2 hours ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

3 hours ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

3 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

4 hours ago