కంగన రనౌత్ దగ్గర కాంట్రవర్సీకి కంటెంట్ అయిపోయిన ప్రతిసారీ ‘ప్రెజెంట్ మేడమ్’ అంటూ ఎవరో ఒకరు చెయ్యెత్తి ఆమెకు కొత్త కంటెంట్ ఇస్తున్నారు. బాలీవుడ్లో బంధుప్రీతికి వ్యతిరేకంగా ఆమె గతంలోనే నిరసన తెలిపింది. అది చల్లారిపోయిన తర్వాత మళ్లీ సుషాంత్ సింగ్ రాజ్పుట్ మరణంతో ఆమె అదే అంశాన్ని తెరమీదకు తెచ్చింది.
రియా చక్రవర్తి అరెస్ట్తో అది మళ్లీ మరుగున పడిపోతున్న టైమ్లో కంగన ఆఫీసుని అక్రమ కట్టడమంటూ కూల్చేయడం ఆమెకు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఈలోగా జయాబచ్చన్, ఊర్మిళ లాంటి వాళ్లు కంగనపై కామెంట్ చేసి మరికాస్త పబ్లిసిటీకి దోహదపడ్డారు. తాజాగా పాయల్ ఘోష్ తనపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అఘాయిత్యం చేయబోయాడంటూ ఇంటర్వ్యూ ఇవ్వడంతో కంగన ఈ టాపిక్ని తన వెపన్గా మార్చేసుకుంది.
తనకు ఇండస్ట్రీలో అలాంటి అనుభవాలెన్నో ఎదురయ్యాయని, చాలా మంది అగ్ర హీరోలు తనను వ్యాన్లో, ఇంట్లో, ఆఫీసులో సెక్సువల్గా వేధించారని అంటూనే ఇండస్ట్రీలో ఆడవాళ్లకే కాకుండా మగవాళ్లకు కూడా సేఫ్టీ లేదని, కామవాంఛతో రగిలిపోయే సినిమా వాళ్లు అమాయకులు, బలహీనులయిన కుర్రాళ్లను కూడా సెక్సువల్గా హింసిస్తారని ఆమె ఆరోపించింది. బాలీవుడ్ ఇండస్ట్రీపై అంతటా విమర్శలు పెల్లుబుకుతోన్న వేళ కంగన ఆ అగ్నిపై ఆజ్యం చల్లుతూనే వుంది. ఆమె చేతికి ఆ నూనెను ఎవరో ఒకరు ఇలా పాయల్ మాదిరిగా అందిస్తూనే వున్నారు.
This post was last modified on September 21, 2020 11:17 am
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…