‘అంధాధూన్’ రీమేక్లో టబు పాత్రలో ఎవరైనా హీరోయిన్ మెటీరియల్ వుండి తీరాలని నితిన్ పట్టుబట్టాడు. నయనతార కోసం ఏకంగా అయిదు కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. కానీ ఆమె అంతకు రెండింతలు ఇస్తే చేస్తానందట. కాజల్ని కూడా ట్రై చేసాడు కానీ మరీ వ్యాంపిష్గా వుండే విలన్ పాత్ర కావడంతో ఆమె చేయననేసింది. శ్రియను అనుకున్నారు కానీ ఆమెకి ఇప్పుడు హీరోయిన్ ఇమేజ్ లేదు. అందువల్ల సినిమాకు ఏ విధంగాను ప్లస్ అవ్వదు.
ఆ అన్వేషణలో తమన్నా అయితే ఎలాగుంటుందని ఆమెను సంప్రదిస్తే కాజల్ మాదిరిగానే ఆమె ససేమీరా అనేసిందట. ఇంకా హీరోయిన్గా నటిస్తోన్న టైమ్లో ఆ తరహా నెగెటివ్ క్యారెక్టర్, పైగా వ్యాంప్ ఫీల్ వుండే పాత్ర ఎలా చేస్తానని తటపటాయించిందట. కానీ నితిన్ ఆమెకు రెండు సినిమాలకి వచ్చే పారితోషికం సింగిల్ పేమెంట్లో ఇచ్చేస్తానని చెప్పడంతో ఆమె ఇక కాదనలేకపోయింది. ఎలాగో ఆ క్యారెక్టర్ చేస్తే చాలా మంచి పేరు వస్తుందని తమన్నాకు తెలుసు.
తన కెరీర్ టర్న్ తీసుకుని మరిన్ని సంచలనాత్మక పాత్రలు కూడా తనను వెతుక్కుంటూ రావచ్చు. అటు పేరుకి పేరు, ఇటు డబ్బుకి డబ్బు కూడా వచ్చేస్తుండడంతో ఇక తమన్నా పెద్దగా ఆలోచించలేదు. ఎలాగో పెద్ద హీరోల పక్కన తనకు ఛాన్సులు రావడం లేదిపుడు. ఇలాంటి టైమ్లో ఈ క్యారెక్టర్ చేయడమంటే తనకు అన్ని విధాలా బోనస్సేనని తమన్నా కరక్ట్ గా క్యాచ్ చేసింది.
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…