రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారనే వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇవాళ జరిగిన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యేల మీటింగ్ లో అధ్యక్షుడి ఎంపిక తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన ఏమైనా వస్తుందేమో అనుకుంటే రేపే చూడమంటూ బాబు సస్పెన్స్ లో పెట్టేశారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మాత్రం ఉప ముఖ్యమంత్రి ట్యాగ్ తెగ వాడేస్తున్నారు. చిరంజీవికి స్టేజి గెస్టుగా ప్రత్యేక ఆహ్వానం వెళ్లడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది.
ఒకవేళ నిజమైతే ముందుగా సంబరపడేది టాలీవుడ్డే. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోని పరిశ్రమ అదే తరహా సహకారం ఆంధ్రప్రదేశ్ నుంచి కోరుకుంటోంది. జగన్ సర్కారు ఉన్నంత కాలం అది జరగలేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి పలుమార్లు ఎంతో సహాయసహకారాలు అందించిన చంద్రబాబునాయుడుతో పాటు ఉప పీఠం పై పవన్ కళ్యాణ్ ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. పైగా నిర్మాతల సాధక బాధలు అన్నీ ప్రత్యక్షంగా చూసిన హీరో కాబట్టి ఖచ్చితంగా సానుభూతి కోణంలోనే నిర్ణయాలు ఉంటాయని చెప్పనక్కర్లేదు.
రేపటికి దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ నెల 27 విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడి నుంచే ప్రత్యేక వెసులుబాట్లు ఉండే అవకాశం లేకపోలేదు. టికెట్ రేట్లు, స్పెషల్ షోలకు ఎలాంటి అక్కర్లేని అడ్డంకులు ఉండవని తెలుస్తోంది. పరిశ్రమ ప్రాథమికంగా హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ షూటింగులు, డిస్ట్రిబ్యూషన్లు, స్టూడియోలు, ఈవెంట్ల తాలూకు వేదికలు ఇతరత్రా ఎన్నో వ్యవహారాలు ఏపీతో ముడిపడి ఉన్నాయి. పైగా రెవిన్యూ పరంగా ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాలు చాలా కీలకం. ఇకపై పవన్ కళ్యాణ్ గెస్టుగా రావాల్సిన సినిమా వేడుకలు ఎన్ని ఉండబోతున్నాయో లెక్కచెప్పడం కష్టం.
This post was last modified on June 11, 2024 3:12 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…