రెగ్యులర్ గా వాళ్ళ డబ్బింగ్ సినిమాలు రాకపోయినా దివంగత కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ అంటే మనకూ సుపరిచితమే. ఆయన వారసుల్లో శివ రాజ్ కుమార్ ఇటీవలే జైలర్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రామ్ చరణ్ 16లో కీలక పాత్ర ఒప్పుకోవడం ద్వారా టాలీవుడ్ లో ఫుల్ లెన్త్ రోల్ తో డెబ్యూ చేస్తున్నాడు. అంతకు ముందు గౌతమీపుత్ర శాతకర్ణి బుర్రకథ పాటలో క్యామియో చేయడం గుర్తే. చివరి కొడుకు పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన సమయంలో టాలీవుడ్ జనాలు కూడా బాధ పడ్డారు. అందుకే చివరి చిత్రం జేమ్స్ ని టాక్ తో సంబంధం లేకుండా ఏపీ తెలంగాణలో చూశారు.
ఇక అసలు విషయానికి వద్దాం. శివన్న తమ్ముడు పునీత్ అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ రెండో కొడుకు యువ రాజ్ కుమార్. ఇటీవలే హోంబాలే ఫిలింస్ నిర్మించిన యువతో సినీ రంగంలో లాంచ్ అయ్యాడు. ఇతని భార్య పేరు శ్రీదేవి భైరప్ప. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. పెద్దలు ఒప్పుకోకపోతే పునీత్ దగ్గరుండి రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి జరిపించాడు. కట్ చేస్తే ఇప్పుడు యువ, శ్రీదేవి భైరప్ప విడాకుల వ్యవహారం రచ్చకెక్కింది. తన భర్తకు అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
దానికి బదులుగా యువ తరఫున లాయర్ శ్రీదేవినే మరొకరితో సన్నిహితంగా ఉందంటూ అన్న మాటలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. శ్రీదేవి తనను విపరీతంగా హింస పెడుతోందని యువ అంటుండగా, వేరొకరితో సంబంధం వల్లే ఇలా అంటున్నాడని ఆమె రివర్స్ కౌంటర్ వేస్తోంది. ట్విస్టు ఏంటంటే యువకు లైంగిక సమస్య కూడా ఉందని శ్రీదేవి చెప్పడం. ఇదంతా ఎంత దూరం వెళ్తుందో కానీ రాజ్ కుమార్ ని విపరీతంగా అభిమానించే ఫ్యాన్స్ ఈ పరిణామాలు చూస్తూ బాధపడుతున్నారు. తప్పెవరిదో గుర్తించి వీలైనంత త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.
This post was last modified on June 11, 2024 11:38 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…