థియేటర్ రిలీజ్ కు ఓటిటికి మధ్య సరిపడా గ్యాప్ ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నా నిర్మాతలు దానికి కట్టుబడటం కష్టసాధ్యమైపోయింది. మే 31న భారీ అంచనాల మధ్య విడుదలైన గ్యాంగ్స్ అఫ్ గోదావరి జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
అంటే డిజిటల్ విండో కేవలం రెండు వారాలే. ఈ సినిమా అంచనాలు పూర్తిగా అందుకోని మాట వాస్తవమే కానీ మరీ ఘోరమైన వసూళ్లు దక్కలేదు. టీమ్ అధికారికంగా చెప్పిన ప్రకారమే మొదటి వీక్ ఎండ్ లోనే 80 శాతం రికవరీ జరిగింది. ఇంకా రన్ కొనసాగుతూనే ఉంది.
అలాంటప్పుడు ఇంత త్వరగా ఓటిటిలో వచ్చేయడం దేనికి సంకేతమిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం అనుకోవడానికి లేదు. అగ్రిమెంట్ టైంలోనే స్పష్టంగా తేదీతో సహా లాక్ చేసుకుంటారు.
సో ఫలితాన్ని ముందే ఊహించి నిర్మాత నాగవంశీ ఒప్పందం చేసుకున్నారా లేక త్వరగా స్ట్రీమ్ చేసుకునేందుకు అదనపు మొత్తాన్ని ఏమైనా ఆఫర్ చేశారేమో తెలియదు. గతంలో ఇదే సంస్థ నుంచి వచ్చిన గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ లు నెల రోజుల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో రాగా గ్యాంగ్స్ అఫ్ గోదావరికి ఆ మాత్రం స్పేస్ కూడా ఇవ్వకపోవడం అసలు ట్విస్టు.
ఈ లెక్కన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి రెండో భాగం ఉండటం అనుమానంగానే ఉంది. రిలీజ్ రోజు సక్సెస్ మీట్ లో దర్శకుడు చైతన్య కృష్ణ ఖచ్చితంగా సీక్వెల్ తీస్తామని అన్నాడు కానీ ఇప్పుడు మాత్రం డౌట్ వస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని అందుబాటులోకి తెస్తున్నారు.
కొత్త సినిమాల హక్కుల విషయంలో విపరీతమైన దూకుడు చూపిస్తున్న నెట్ ఫ్లిక్స్ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సర్ప్రైజ్ లు చాలా ఇచ్చేలా ఉంది. విశ్వక్ సేన్ కెరీర్ లోనే పాత్ బ్రేకింగ్ మూవీగా నిలుస్తుందన్న సినిమా ఇంత తక్కువ థియేట్రికల్ రన్ దక్కించుకోవడం బ్యాడ్ లక్.
This post was last modified on June 9, 2024 4:20 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…