Movie News

మనమే ఇలాగే నిలబడితే జయమే

మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో చెప్పుకోదగ్గ ముద్ర వేసింది మనమే ఒక్కటే. కాజల్ అగర్వాల్ సత్యభామ దాని జానర్ ప్రేక్షకులను సైతం మెప్పించలేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ మనమే అయ్యింది. బుక్ మై షో ట్రెండ్ ప్రకారం చూస్తే మొదటి రోజు 55 వేల టికెట్లు అమ్ముడుపోతే రెండు రోజు శనివారం ఏకంగా 67 వేల టికెట్లు సేలయ్యాయి.

ఇవాళ సండే కనీసం లక్షకు పైగా నమోదయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇవి అత్యంత భారీ అని చెప్పలేం కానీ మనమేకు వచ్చిన టాక్ ప్రకారం చూసుకుంటే డీసెంట్ కన్నా బెటరనే చెప్పాలి. అసలు సవాల్ రేపటి నుంచి ఉంటుంది.

సోమవారం నుంచి డ్రాప్ శాతం ఎంత ఉంటుందనేది బాక్సాఫీస్ స్టేటస్ ని నిర్ణయించబోతోంది. ఒకవేళ కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీని నిలబెట్టుకోగలిగితే హిట్ వైపు పరుగులు పెట్టొచ్చు. కానీ అదంత సులభం కాదు. శర్వానంద్ కృతి శెట్టి జంట, చైల్డ్ సెంటిమెంట్, ఎమోషన్స్, కలర్ ఫుల్ లండన్ విజువల్ ఇలా అన్ని హంగులు ఉన్నట్టు కనిపిస్తున్నా ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మనమే సంతృప్తిపరచలేకపోయింది.

అయినా సరే మరీ బ్యాడ్ గా లేదనే మౌత్ టాక్ శ్రీరామ రక్షలా కాపాడుతోంది. హేశం అబ్దుల్ వహాబ్ పేరుకు పదహారు పాటలు ఇచ్చినా గొప్ప ఆల్బమ్ కాలేకపోయింది.

వచ్చే వారం సుధీర్ బాబు హరోంహరతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు పోటీ ఉన్నాయి కాబట్టి కుటుంబ ప్రేక్షకుల పరంగా చూసుకుంటే మనమేకి ఇంకో వారం ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ టాక్ తో ఎంతమేరకు స్థిరంగా ఉంటుందనేది వేచి చూడాలి.

శర్వానంద్ మాత్రం హ్యాపీగా ఉన్నాడు. హైదరాబాద్ థియేటర్లకు వెళ్లి ప్రత్యక్షంగా స్పందన తెలుసుకుంటూ వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ టైంలో దిల్ రాజు ఇలానే చేశారు కానీ ఆ తర్వాత రిజల్ట్ తెలిసిందే. కానీ మనమే కంటెంట్ పరంగా దానికన్నా మెరుగ్గా ఉండటం సానుకూలాంశం.

This post was last modified on June 9, 2024 3:03 pm

Share
Show comments
Published by
Satya
Tags: SHarwanand

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

6 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

12 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

3 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago