Movie News

న‌ష్ట‌మైనా.. ఇష్టంగా.. రామోజీ ప్ర‌యోగాలు!

సాధార‌ణంగా మీడియా అయినా.. టీవీ అయినా.. వ్యాపార రంగంలో ఉన్న వారు.. న‌ష్టాలు వ‌స్తే.. ఏ ప‌నీ చేయ‌రు. లాభాల పంట పండేవే కోరుకుంటారు. ఏ చిన్న న‌ష్టం వ‌స్తుంద‌ని తెలిసినా.. స‌ద‌రు కార్య‌క్ర‌మా ల‌కు వెంట‌నే బ్రేకేలు వేసేస్తారు. మ‌రికొన్ని కొత్త కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభిస్తారు. కానీ, రామోజీ రావు.. మాత్రం త‌ను ప్రారంభించిన వాటిలో స‌మాజ హిత‌మే కాకుండా… చిన్నారుల‌కు విద్యాబుద్ధులు నేర్ప‌డంలోనూ.. చ‌రిత్ర‌ను వారికి అందించ‌డంలోనూ.. వ్య‌య ప్ర‌యాస‌లు ఎదురైనా.. వెనుక‌డుగు వేయ‌లేదు. ఇలాంటివి కొన్ని చూద్దాం..

మాల్గుడి క‌థ‌లు: ఈటీవీ ప్రారంభించిన త‌ర్వాత‌… ప్ర‌తి ఆదివారం ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల మ‌ధ్య మాల్గుడిక‌థ‌ల‌ను ప్ర‌సారం చేశారు. వీటికి మొద‌ట్లో మంచి ఆద‌ర‌ణ ల‌భించినా.. పోటీ చానెళ్లు ప్రారంభించిన వేరే కార్య‌క్ర‌మాల ఎఫెక్ట్ ప‌డింది. దీంతో వీక్ష‌కుల సంఖ్య త‌గ్గిపోయింది. అయిన‌ప్ప‌టికీ.. రామోజీ రావు.. ఆసాంతం పూర్త‌య్యే వ‌ర‌కు వీటిని కొన‌సాగించారు. న‌ష్టాలు వ‌చ్చినా.. యాడ్స్ రాక‌పోయినా భ‌రించారు.

అమ‌రావ‌తి క‌థ‌లు: స‌త్యం శంక‌ర‌మంచి రాసిన పుస్త‌కం ఆధారంగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే రూపొందిం చిన అమ‌రావ‌తి క‌థ‌లు కూడా.. స‌మాజ హితం కోసం ప్ర‌సారం చేసిన‌వే. కానీ ఇవి కూడా.. ప్రేక్ష‌కాద‌ర‌ణకు నోచుకోలేదు. అయినా.. ప్ర‌సారాల‌ను కొన‌సాగించారు.

పంచ‌తంత్రం: చిన్నారుల‌ను చైతన్య ప‌రిచే.. వారిలో బుద్ధి కుశ‌ల‌త‌ను పెంచే పంచ‌తంత్ర క‌థ‌లు ఎన్న‌ద‌గిన‌వి. ప‌ర‌వ‌స్తు చిన్న‌య సూరి రాసిన క‌థల ఆధారంగా రూపొందించిన ఈ తొలు బొమ్మ‌లాట‌ల‌ను సుదీర్ఘంగా కొన‌సాగించారు. వీటికి కూడా..యాడ్స్ రాలేదు. అయినా.. ఎక్క‌డా వెనక్కి త‌గ్గ‌లేదు.

భాగ‌వ‌తం: మ‌హాభార‌తంలోని కీల‌క ఘ‌ట్ట‌మైన భాగ‌వ‌తాన్ని వ్య‌య ప్ర‌యాస‌లు ఓర్చి.. బాపు ద‌ర్శ‌క‌త్వం, ర‌మణ సాహిత్య స‌హ‌కారంతో 350 ఎపిసోడ్లు ప్లాన్ చేశారు. ఆదిలో జోరుగా సాగిన భాగ‌వ‌తం సీరియ‌ల్‌.. మ‌ధ్య‌లో చిక్కులు ప‌డింది. రామోజీ కుమారుడే.. బాపును త‌ప్పుకోమ‌న‌డంతో ఇబ్బందులు వ‌చ్చాయి. అయినా.. కుమారుడి కోరిక మేర‌కు.. సుమ‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనే వీటిని కొన‌సాగించారు.

బాల భార‌తం: పిల్ల‌ల కోసం.. తీసుకువ‌చ్చిన స‌చిత్ర క‌థాప్ర‌పంచం బాల భారతం. తొలినాళ్ల‌లో పుస్త‌కం రూపంలో తీసుకువ‌చ్చారు. త‌ర్వాత‌.. ఇప్పుడు ఈటీవీ లో బాల భార‌తం ప్ర‌త్యేక ఛానెల్ ప్ర‌సారంలో ఉంది. దీనికి కూడా పెద్ద‌గా లాభాలు లేవు. అయినా.. కొన‌సాగిస్తున్నారు. ఇది రామోజీ రావు అభిరుచి.

తెలుగు వెలుగు: ఇది మాస ప‌త్రిక‌. తెలుగు వెలుగుల‌కు ప‌ట్టం క‌డుతూ.. 2015లో తీసుకువ‌చ్చిన ప‌త్రిక ఇది. అయితే.. ఇది కొన్నాళ్ల వ‌ర‌కు ఆద‌ర‌ణ పొందినా.. త‌ర్వాత‌.. ప్రింటింగ్ నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో ప‌త్రిక కొన‌సాగుతోంది. ఇలా.. రామోజీ రావు.. త‌న వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చినా.. ఇష్టానికి పెద్ద పీట వేసిన‌.. ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

2 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

11 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

12 hours ago