సాధారణంగా మీడియా అయినా.. టీవీ అయినా.. వ్యాపార రంగంలో ఉన్న వారు.. నష్టాలు వస్తే.. ఏ పనీ చేయరు. లాభాల పంట పండేవే కోరుకుంటారు. ఏ చిన్న నష్టం వస్తుందని తెలిసినా.. సదరు కార్యక్రమా లకు వెంటనే బ్రేకేలు వేసేస్తారు. మరికొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కానీ, రామోజీ రావు.. మాత్రం తను ప్రారంభించిన వాటిలో సమాజ హితమే కాకుండా… చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంలోనూ.. చరిత్రను వారికి అందించడంలోనూ.. వ్యయ ప్రయాసలు ఎదురైనా.. వెనుకడుగు వేయలేదు. ఇలాంటివి కొన్ని చూద్దాం..
మాల్గుడి కథలు: ఈటీవీ ప్రారంభించిన తర్వాత… ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మాల్గుడికథలను ప్రసారం చేశారు. వీటికి మొదట్లో మంచి ఆదరణ లభించినా.. పోటీ చానెళ్లు ప్రారంభించిన వేరే కార్యక్రమాల ఎఫెక్ట్ పడింది. దీంతో వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. అయినప్పటికీ.. రామోజీ రావు.. ఆసాంతం పూర్తయ్యే వరకు వీటిని కొనసాగించారు. నష్టాలు వచ్చినా.. యాడ్స్ రాకపోయినా భరించారు.
అమరావతి కథలు: సత్యం శంకరమంచి రాసిన పుస్తకం ఆధారంగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే రూపొందిం చిన అమరావతి కథలు కూడా.. సమాజ హితం కోసం ప్రసారం చేసినవే. కానీ ఇవి కూడా.. ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అయినా.. ప్రసారాలను కొనసాగించారు.
పంచతంత్రం: చిన్నారులను చైతన్య పరిచే.. వారిలో బుద్ధి కుశలతను పెంచే పంచతంత్ర కథలు ఎన్నదగినవి. పరవస్తు చిన్నయ సూరి రాసిన కథల ఆధారంగా రూపొందించిన ఈ తొలు బొమ్మలాటలను సుదీర్ఘంగా కొనసాగించారు. వీటికి కూడా..యాడ్స్ రాలేదు. అయినా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
భాగవతం: మహాభారతంలోని కీలక ఘట్టమైన భాగవతాన్ని వ్యయ ప్రయాసలు ఓర్చి.. బాపు దర్శకత్వం, రమణ సాహిత్య సహకారంతో 350 ఎపిసోడ్లు ప్లాన్ చేశారు. ఆదిలో జోరుగా సాగిన భాగవతం సీరియల్.. మధ్యలో చిక్కులు పడింది. రామోజీ కుమారుడే.. బాపును తప్పుకోమనడంతో ఇబ్బందులు వచ్చాయి. అయినా.. కుమారుడి కోరిక మేరకు.. సుమన్ దర్శకత్వంలోనే వీటిని కొనసాగించారు.
బాల భారతం: పిల్లల కోసం.. తీసుకువచ్చిన సచిత్ర కథాప్రపంచం బాల భారతం. తొలినాళ్లలో పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. తర్వాత.. ఇప్పుడు ఈటీవీ లో బాల భారతం ప్రత్యేక ఛానెల్ ప్రసారంలో ఉంది. దీనికి కూడా పెద్దగా లాభాలు లేవు. అయినా.. కొనసాగిస్తున్నారు. ఇది రామోజీ రావు అభిరుచి.
తెలుగు వెలుగు: ఇది మాస పత్రిక. తెలుగు వెలుగులకు పట్టం కడుతూ.. 2015లో తీసుకువచ్చిన పత్రిక ఇది. అయితే.. ఇది కొన్నాళ్ల వరకు ఆదరణ పొందినా.. తర్వాత.. ప్రింటింగ్ నిలిపివేశారు. ఆన్లైన్లో పత్రిక కొనసాగుతోంది. ఇలా.. రామోజీ రావు.. తన వ్యాపారంలో నష్టాలు వచ్చినా.. ఇష్టానికి పెద్ద పీట వేసిన.. ఘటనలు అనేకం ఉన్నాయి.
This post was last modified on June 8, 2024 5:58 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…