ఈనాడు సంస్థల అధిపతిగా, మీడియా మొఘల్ గా ప్రసిద్దికెక్కిన రామోజీరావు ఒక మంచి నిర్మాత కూడా. ప్రపంచంలోనే పెద్దదయిన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించడమే కాదు ఆయన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద 85 సినిమాలను ఆయన నిర్మించారు. ఎందరో ప్రతిభ ఉన్న దర్శకులు, నటీనటులను ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించారు.
మయూరి, మౌనపోరాటం, ప్రతిఘటన, మనసు మమత, అశ్వని, పీపుల్స్ ఎన్ కౌంటర్, ఆనందం, నువ్వేకావాలి వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సినిమాలను ఆయన నిర్మించారు. ఈ సంస్థ చివరగా 2015లో తీసిన సినిమా రాజేంద్రప్రసాద్ హీరోగా దాగుడు మూతా దండాకోర్. దర్శకుడు క్రిష్ సమర్పణలో ఆర్.కె. మలినేని దీనికి దర్శకత్వం వహించాడు
ఆయితే ఆ తర్వాత మరో 15 సినిమాలు తీసి సెంచరీ కొట్టాలని రామోజీరావు ప్రయత్నించారు. కొందరు హిట్ దర్శకులను పిలిపించుకుని ఉషాకిరణ్ మూవీస్ కథలు కూడా సిద్దం చేసింది. 2019 సమయంలో మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ ను యాక్టివ్ చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. కొంత మందికి సంస్థ అడ్వాన్సులు కూడా ఇచ్చింది. అయితే ఈ ప్రయత్నాలలో ఉండగానే కరోనా విపత్తు రావడం, ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిరుచులు మారడంతో రామోజీరావు ఆ ప్రయత్నాలను పక్కన పెట్టేశారు. ఆ విధంగా సెంచరీ కొట్టాలన్న కోరిక తీరకుండానే ఆయన మరణించారు.
This post was last modified on June 8, 2024 11:46 am
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…