ఈనాడు సంస్థల అధిపతిగా, మీడియా మొఘల్ గా ప్రసిద్దికెక్కిన రామోజీరావు ఒక మంచి నిర్మాత కూడా. ప్రపంచంలోనే పెద్దదయిన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించడమే కాదు ఆయన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ మీద 85 సినిమాలను ఆయన నిర్మించారు. ఎందరో ప్రతిభ ఉన్న దర్శకులు, నటీనటులను ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించారు.
మయూరి, మౌనపోరాటం, ప్రతిఘటన, మనసు మమత, అశ్వని, పీపుల్స్ ఎన్ కౌంటర్, ఆనందం, నువ్వేకావాలి వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే సినిమాలను ఆయన నిర్మించారు. ఈ సంస్థ చివరగా 2015లో తీసిన సినిమా రాజేంద్రప్రసాద్ హీరోగా దాగుడు మూతా దండాకోర్. దర్శకుడు క్రిష్ సమర్పణలో ఆర్.కె. మలినేని దీనికి దర్శకత్వం వహించాడు
ఆయితే ఆ తర్వాత మరో 15 సినిమాలు తీసి సెంచరీ కొట్టాలని రామోజీరావు ప్రయత్నించారు. కొందరు హిట్ దర్శకులను పిలిపించుకుని ఉషాకిరణ్ మూవీస్ కథలు కూడా సిద్దం చేసింది. 2019 సమయంలో మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ ను యాక్టివ్ చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. కొంత మందికి సంస్థ అడ్వాన్సులు కూడా ఇచ్చింది. అయితే ఈ ప్రయత్నాలలో ఉండగానే కరోనా విపత్తు రావడం, ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిరుచులు మారడంతో రామోజీరావు ఆ ప్రయత్నాలను పక్కన పెట్టేశారు. ఆ విధంగా సెంచరీ కొట్టాలన్న కోరిక తీరకుండానే ఆయన మరణించారు.
This post was last modified on June 8, 2024 11:46 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…