ప్రయాణం, ఊసరవెల్లి లాంటి తెలుగులో సినిమాలతో పాటు హిందీలోనూ కొన్ని సినిమాలు చేసిన ముంబయి భామ పాయల్ రాజ్పుత్.. బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.
ఆమె ఆరోపణల్లో నిజమెంత.. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇన్నేళ్లు దాచిపెట్టి ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తోంది.. అనురాగ్ నరేంద్ర మోడీ సర్కారు మీద ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో భాజపా వర్గీయులు వెనుక ఉండి పాయల్తో ఆరోపణలు చేయించారా.. లాంటి అనేక సందేహాలు తలెత్తుతున్న మాట వాస్తవమే కానీ.. అదే సమయంలో ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టి పారేయడానికీ లేదు. ఈ విషయంలో కొందరు బాలీవుడ్ ప్రముఖులు అనురాగ్ వైపు నిలబడే ప్రయత్నం చేశారు. అందులో ఆయనకు సన్నిహితురాలైన తాప్సి పన్ను కూడా ఒకరు.
ఐతే సినీ పరిశ్రమలో అమ్మాయిల మీద జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాల విషయంలో తాప్సి గతంలో స్పందించిన తీరుకు.. ఇప్పుడు రెస్పాండైన వైనానికి పొంతన లేకపోవడంతో నెటిజన్లు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కిందట ‘మీ టూ’ ఉద్యమం గట్టిగా సాగిన సమయంలో.. తమపై జరిగిన అఘాయిత్యాల గురించి చెప్పుకున్న అమ్మాయిలకు మద్దతు ఇవ్వకపోగా, వాళ్ల మీద ఎదురు దాడి చేస్తారా అని ఆమె ట్విట్టర్లో ప్రశ్నించింది. అంతే కాక ఒక మహిళ తనకు అన్యాయం జరిగిందంటే.. సాటి మహిళలే మద్దతు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది.
ఐతే ఇప్పుడు పాయల్ తనను అనురాగ్ లైంగికంగా వేధించాడని అంటుంటే.. ఆమె వెర్షన్ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అనురాగ్కు మద్దతుగా ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టేసింది తాప్సి. అతణ్ని మించిన ఫెమినిస్టు లేడని.. తన సినిమాల్లో మహిళల్ని గొప్పగా చూపించాడని అంటూ పరోక్షంగా పాయల్ ఆరోపణల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవాలన్నట్లుగా మాట్లాడింది తాప్సి. మరి సాటి మహిళ ఇప్పుడు తన బాధ చెప్పుకుంటుంటే తాప్సి ఆమెకు యాంటీగా నిలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ నెటిజన్లు ఆమె హిపోక్రసీని బయటపెట్టి ట్రోల్ చేస్తున్నారు.
This post was last modified on September 20, 2020 2:21 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…