ఎన్నికలు అయిపోయాయి. ప్రభుత్వం ఎవరిదో స్పష్టత వచ్చేసింది. ప్రమాణ స్వీకార లాంఛనం ఇంకో వారం రోజుల్లో అయిపోతుంది. ఇక టాలీవుడ్ ప్రపంచంలోకి అడుగు పెట్టే సమయం వచ్చేసింది. ఇంకోవైపు స్కూళ్ళు, కాలేజీలు జూన్ 12 నుంచి తెరవబోతున్న నేపథ్యంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్ కు చాలా కీలకం కానుంది. తెలుగు జనాలకు వినోదం పరంగా మొదటి ప్రాధాన్యం థియేటరే కాబట్టి ఇక నుంచి టికెట్ కౌంటర్లు బిజీగా మారాలని బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. పైకి రెండు మూడు హైలైట్ అవుతున్నాయి కానీ డబ్బింగులతో కలుపుకుని రేపు ఏకంగా 11 సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.
శర్వానంద్ ‘మనమే’కు ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా మంచి బజ్ ఉంది. దాన్ని నిలబెట్టుకుంటే చాలు నాని హాయ్ నాన్న తరహాలో చక్కని విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. సెన్సార్ టాక్ పాజిటివ్ గా వినిపిస్తోంది. కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ క్రైమ్ లవర్స్ ని టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ అన్ని వర్గాలను, ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. నిన్న మహిళల కోసం స్పెషల్ షో కూడా వేశారు. నవదీప్ హీరోగా నటించిన ‘లవ్ మౌళి’ యూత్ ని రప్పిస్తుందనే ధీమా మేకర్స్ లో ఉంది. దానికి తగ్గట్టే లవ్, రొమాన్స్ ని ఘాటుగా దట్టించినట్టు ప్రమోషన్లలో అర్థమైపోయింది.
పాయల్ రాజ్ పుత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘రక్షణ’ మీద బజ్ లేకపోయినా టాక్ ని నమ్ముకున్నారు దర్శక నిర్మాత. బేబీ అసలు కథ నాదేనంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసిన దర్శక రచయిత శిరిన్ శ్రీరామ్ అదే స్టోరీగా చెప్పబడుతున్న ‘ప్రేమించొద్దు’ రేపే వస్తోంది. ఇవి కాకుండా నమో, గోల్డ్ నెంబర్ వన్, ఓసిలు బరిలో ఉన్నాయి. సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన తమిళ అనువాదం ‘వెపన్’కు ఒరిజినల్ లో ఉన్న హైప్ ఇక్కడ లేదు. పిల్లల చిత్రం చోటా భీం అండ్ కర్స్ అఫ్ దంయాన్, హాలీవుడ్ మూవీ బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డైలు వస్తున్నాయి. రీ రిలీజ్ ప్రేమకథా చిత్రమ్, భారతీయుడు, చక్రం వాయిదా పడ్డాయి.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…