Movie News

భర్త అందంపై కామెంట్.. హీరోయిన్ హర్ట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో వారసులందరూ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ పెద్దగా నటనలో పేరు తెచ్చుకోకపోయినా, కేవలం ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ కారణంగా అవకాశాలు అందుకుంటున్న సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ లాంటి వాళ్లకు సోషల్ మీడియా హీట్ మామూలుగా లేదు. మామూలుగానే సోనమ్‌ను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తుంటారు. ఈ మధ్య అది మరీ ఎక్కువైంది. హేట్ కామెంట్లతో ఆమెను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. తాజాగా ఒక మహిళ తనను, తన భర్తను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేసిందంటూ సోనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ట్వీట్‌ను షేర్ చేసి.. ఆమెపై తన ఆగ్రహాన్ని చూపించింది. ఇంతకీ సోనమ్‌కు ఆ మహిళ పెట్టిన ట్వీట్‌లో ఏముందంటే..

‘‘మీ నాన్న లేకపోతే నువ్వు జీరో. నీకు నటించడం రాదు. నీ కుటుంబ నేపథ్యం వల్లే నువ్వు కొన్ని సినిమాలు చేయగలిగావు. నీలాంటి వాళ్లు సమాజంలో నెగిటివిటీనీ వ్యాప్తి చేశారు. నీలాంటి మహిళకు భారత్‌తోపాటు ఈ ప్రపంచం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషకరం. నీ భర్త చాలా అందంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. మరోసారి ఆయణ్ని చూడు. ఎంత అందవిహీనంగా ఉన్నాడో తెలుస్తుంది’’ అని ఆ మహిళ కామెంట్ చేసింది. దీనికి సోనమ్ బదులిస్తూ.. ‘‘ఈ మహిళ నాకు నీచమైన మెసేజ్ పంపింది. ఇలాంటి మెసేజ్‌ల ద్వారా ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటోంది. నా దృష్టిలో పడడానికే నువ్వు ఈ మెసేజ్ పంపావని తెలుసు. ఆమె వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఇంత ద్వేషం మనసులో ఉంటే అది వాళ్లనే నాశనం చేస్తుంది’’ అని పేర్కొంది. అయితే సదరు మహిళ ఈ మెసేజ్‌కు స్పందిస్తూ.. తన అకౌంట్ హ్యాక్ అయిందని, తానెప్పుడూ ఇలాంటి హేట్ మెసేజ్‌లు పంపనని పేర్కొడం గమనార్హం.

This post was last modified on September 20, 2020 1:15 am

Share
Show comments
Published by
suman
Tags: Sonam Kapoor

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

1 hour ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

2 hours ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

2 hours ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

3 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

3 hours ago