సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో వారసులందరూ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ పెద్దగా నటనలో పేరు తెచ్చుకోకపోయినా, కేవలం ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కారణంగా అవకాశాలు అందుకుంటున్న సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ లాంటి వాళ్లకు సోషల్ మీడియా హీట్ మామూలుగా లేదు. మామూలుగానే సోనమ్ను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తుంటారు. ఈ మధ్య అది మరీ ఎక్కువైంది. హేట్ కామెంట్లతో ఆమెను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. తాజాగా ఒక మహిళ తనను, తన భర్తను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేసిందంటూ సోనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ట్వీట్ను షేర్ చేసి.. ఆమెపై తన ఆగ్రహాన్ని చూపించింది. ఇంతకీ సోనమ్కు ఆ మహిళ పెట్టిన ట్వీట్లో ఏముందంటే..
‘‘మీ నాన్న లేకపోతే నువ్వు జీరో. నీకు నటించడం రాదు. నీ కుటుంబ నేపథ్యం వల్లే నువ్వు కొన్ని సినిమాలు చేయగలిగావు. నీలాంటి వాళ్లు సమాజంలో నెగిటివిటీనీ వ్యాప్తి చేశారు. నీలాంటి మహిళకు భారత్తోపాటు ఈ ప్రపంచం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషకరం. నీ భర్త చాలా అందంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. మరోసారి ఆయణ్ని చూడు. ఎంత అందవిహీనంగా ఉన్నాడో తెలుస్తుంది’’ అని ఆ మహిళ కామెంట్ చేసింది. దీనికి సోనమ్ బదులిస్తూ.. ‘‘ఈ మహిళ నాకు నీచమైన మెసేజ్ పంపింది. ఇలాంటి మెసేజ్ల ద్వారా ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటోంది. నా దృష్టిలో పడడానికే నువ్వు ఈ మెసేజ్ పంపావని తెలుసు. ఆమె వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఇంత ద్వేషం మనసులో ఉంటే అది వాళ్లనే నాశనం చేస్తుంది’’ అని పేర్కొంది. అయితే సదరు మహిళ ఈ మెసేజ్కు స్పందిస్తూ.. తన అకౌంట్ హ్యాక్ అయిందని, తానెప్పుడూ ఇలాంటి హేట్ మెసేజ్లు పంపనని పేర్కొడం గమనార్హం.
This post was last modified on September 20, 2020 1:15 am
రాష్ట్రానికి గొడ్డలి పార్టీ గ్రహణం వీడిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2019లో రాష్ట్రానికి గొడ్డలి పార్టీ గ్రహణం పట్టుకుందని.. అయితే,…
డిసెంబర్ 24 పోటీ రసవత్తరంగా మారుతోంది. కింగ్ 100 ఆల్రెడీ ఆ డేట్ ని తీసుకోగా తాజాగా బాలయ్య 111…
దశాబ్దాల చరిత్ర కలిగిన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎన్నో డిజాస్టర్లు చూసింది. అన్ని భాషలకు ఇది…
తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మార్కెట్, ఇమేజ్ రెండూ ఉన్నాయి. మహానటి, సీతారామం బ్లాక్ బస్టర్స్ తన రేంజ్ ని…
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పుట్టింటి నుంచి బలవం తంగా…
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసి.. తాజాగా ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టుకు సుమారు 50 సంవత్సరాలకు పైగానే చరిత్ర ఉందని…