సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో వారసులందరూ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ పెద్దగా నటనలో పేరు తెచ్చుకోకపోయినా, కేవలం ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కారణంగా అవకాశాలు అందుకుంటున్న సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ లాంటి వాళ్లకు సోషల్ మీడియా హీట్ మామూలుగా లేదు. మామూలుగానే సోనమ్ను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తుంటారు. ఈ మధ్య అది మరీ ఎక్కువైంది. హేట్ కామెంట్లతో ఆమెను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. తాజాగా ఒక మహిళ తనను, తన భర్తను ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేసిందంటూ సోనమ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ట్వీట్ను షేర్ చేసి.. ఆమెపై తన ఆగ్రహాన్ని చూపించింది. ఇంతకీ సోనమ్కు ఆ మహిళ పెట్టిన ట్వీట్లో ఏముందంటే..
‘‘మీ నాన్న లేకపోతే నువ్వు జీరో. నీకు నటించడం రాదు. నీ కుటుంబ నేపథ్యం వల్లే నువ్వు కొన్ని సినిమాలు చేయగలిగావు. నీలాంటి వాళ్లు సమాజంలో నెగిటివిటీనీ వ్యాప్తి చేశారు. నీలాంటి మహిళకు భారత్తోపాటు ఈ ప్రపంచం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషకరం. నీ భర్త చాలా అందంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. మరోసారి ఆయణ్ని చూడు. ఎంత అందవిహీనంగా ఉన్నాడో తెలుస్తుంది’’ అని ఆ మహిళ కామెంట్ చేసింది. దీనికి సోనమ్ బదులిస్తూ.. ‘‘ఈ మహిళ నాకు నీచమైన మెసేజ్ పంపింది. ఇలాంటి మెసేజ్ల ద్వారా ఫాలోవర్లను సంపాదించాలి అనుకుంటోంది. నా దృష్టిలో పడడానికే నువ్వు ఈ మెసేజ్ పంపావని తెలుసు. ఆమె వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఇంత ద్వేషం మనసులో ఉంటే అది వాళ్లనే నాశనం చేస్తుంది’’ అని పేర్కొంది. అయితే సదరు మహిళ ఈ మెసేజ్కు స్పందిస్తూ.. తన అకౌంట్ హ్యాక్ అయిందని, తానెప్పుడూ ఇలాంటి హేట్ మెసేజ్లు పంపనని పేర్కొడం గమనార్హం.
This post was last modified on September 20, 2020 1:15 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…