Movie News

‘రంగీలా’లో నాగ్, రజినీ, శ్రీదేవి!

రంగీలా సినిమాలో నాగార్జున, రజినీకాంత్, శ్రీదేవి ఏంటి? అని ఆశ్చర్యం కలుగుతోందా? రామ్ గోపాల్ వర్మ ముందు అనుకున్న ప్రకారం అయితే ఆ సినిమాలో ఆ ముగ్గురే నటించాల్సిందట. ప్రధాన పాత్రల్ని ఈ ముగ్గురి దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దాడట. ఈ విషయాన్ని ‘రంగీలా’ ఒరిజినల్ హీరోయిన్ ఊర్మిళనే స్వయంగా వెల్లడించడం విశేషం. ఈ లెజెండరీ మూవీ విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందమంతా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది.

ఓ ఇంటర్వ్యూలో ఊర్మిళ మాట్లాడుతూ.. వర్మ దృష్టిలో కథానాయికగా ముందు తాను లేనని.. ఆయన ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవిని ‘రంగీలా’గా చూపించాలని వర్మ అనుకున్నాడని వెల్లడించింది. అలాగే ఆమిర్ ఖాన్ చేసిన మున్నా పాత్రలో నాగార్జునను, జాకీష్రాఫ్ చేసిన సినీ హీరో పాత్రలో రజినీ కాంత్‌ను పెట్టాలని ఆయన అనుకున్నారని.. ఐతే అనుకోకుండా తాను ఆమిర్ ఖాన్, జాకీష్రాఫ్ ఆ సినిమాలోకి వచ్చామని ఆమె వెల్లడించింది. ‘శివ’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించిన వర్మ.. ‘రంగీలా’తో స్ట్రెయిట్ హిందీ సినిమా తీసి అక్కడా జెండా పాతాడు.

శ్రీదేవి అంటే వర్మకు ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ఆమెను ‘రంగీలా’లా చూపించి ఉంటే కూడా బాగుండేదేమో కానీ.. ఈ సినిమాతో ఊర్మిళ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాకు అలాంటి ఫ్రెష్ హీరోయిన్ అయితేనే ఇలాంటి ఔట్ పుట్ వచ్చేదేమో. ‘రంగీలా’ కథాకథనాలు, సంగీతం, హీరోయిన్ అందాలు.. ఆమిర్, జాకీల నటన.. ఇలా అన్నీ హైలైటే అయ్యాయి. ఈ సినిమా తర్వాత వర్మ వెనుదిరిగి చూసుకోలేదు. దశాబ్దం పాటు బాలీవుడ్‌ను ఏలాడు.

This post was last modified on September 20, 2020 1:06 am

Share
Show comments
Published by
suman

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

15 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

51 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago