ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం తెలుగు సినీ పరిశ్రమ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. రాజకీయాలతో సినిమా వాళ్లకు ఎప్పుడూ సంబంధాలు ఉన్నాయి, రాజకీయాల ప్రభావం సినిమాల మీదా పడుతుంటుంది.
కానీ గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మాత్రం ఫిలిం ఇండస్ట్రీ ఏపీలో బాగా ఒడుదొడుకులు ఎదుర్కొంది. అందుకే ఆ ప్రభుత్వం పోయి కూటమి అధికారంలోకి రావాలనే ఆకాంక్ష మెజారిటీ సినీ జనాల్లో ఉంది. ప్రభుత్వం మారితే నిర్మాతలకు కచ్చితంగా మంచి రోజులు వచ్చినట్లే అని భావిస్తున్నారు.
ఏపీలో ఏర్పాటయ్యే ప్రభుత్వం ఆధారంగా బాగా ప్రభావితం అయ్యే తొలి చిత్రం.. కల్కినే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించిన అశ్వినీదత్.. తెలుగుదేశం మద్దతుదారన్న సంగతి తెలిసిందే. వైకాపాతో ఆయనకు అస్సలు పడదు. ఓపెన్గా ఆ పార్టీని, జగన్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. కూటమికి మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో ఒకవేళ జగన్ సర్కారు వస్తే.. కచ్చితంగా కల్కి సినిమాను టార్గెట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఏదో రకంగా అడ్డంకులు తప్పవు. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మామూలుగా ఇచ్చే అదనపు రేట్లు ఉండకపోవచ్చు.
వేరే రకమైన ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. ఒకవేళ ప్రభుత్వం మారితే మాత్రం కల్కి పంట పండినట్లే. కోరుకున్న స్థాయిలో అదనపు రేట్లు వస్తాయి. అదనపు షోలకు ఇబ్బంది ఉండదు. అలాగే బెనిఫిట్ షోలు కూడా అందుబాటులోకి వస్తాయి.
ఇది ఆ సినిమా ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు దారి తీస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం మారకుంటే డెంట్ కూడా గట్టిగానే పడుతుంది. అందుకే ఏపీ ఎన్నికల ఫలితాల కోసం కల్కి టీం మిగతా వాళ్ల కంటే ఎక్కువ ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఐతే సర్వేలన్నీ చాలా వరకు కూటమికే పట్టం కట్టిన నేపథ్యంలో అశ్వినీదత్ అండ్ కో ధీమాతోనే ఉన్నారు.
This post was last modified on June 4, 2024 6:59 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…