ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం తెలుగు సినీ పరిశ్రమ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. రాజకీయాలతో సినిమా వాళ్లకు ఎప్పుడూ సంబంధాలు ఉన్నాయి, రాజకీయాల ప్రభావం సినిమాల మీదా పడుతుంటుంది.
కానీ గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మాత్రం ఫిలిం ఇండస్ట్రీ ఏపీలో బాగా ఒడుదొడుకులు ఎదుర్కొంది. అందుకే ఆ ప్రభుత్వం పోయి కూటమి అధికారంలోకి రావాలనే ఆకాంక్ష మెజారిటీ సినీ జనాల్లో ఉంది. ప్రభుత్వం మారితే నిర్మాతలకు కచ్చితంగా మంచి రోజులు వచ్చినట్లే అని భావిస్తున్నారు.
ఏపీలో ఏర్పాటయ్యే ప్రభుత్వం ఆధారంగా బాగా ప్రభావితం అయ్యే తొలి చిత్రం.. కల్కినే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించిన అశ్వినీదత్.. తెలుగుదేశం మద్దతుదారన్న సంగతి తెలిసిందే. వైకాపాతో ఆయనకు అస్సలు పడదు. ఓపెన్గా ఆ పార్టీని, జగన్ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. కూటమికి మద్దతు పలికారు.
ఈ నేపథ్యంలో ఒకవేళ జగన్ సర్కారు వస్తే.. కచ్చితంగా కల్కి సినిమాను టార్గెట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఏదో రకంగా అడ్డంకులు తప్పవు. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు మామూలుగా ఇచ్చే అదనపు రేట్లు ఉండకపోవచ్చు.
వేరే రకమైన ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. ఒకవేళ ప్రభుత్వం మారితే మాత్రం కల్కి పంట పండినట్లే. కోరుకున్న స్థాయిలో అదనపు రేట్లు వస్తాయి. అదనపు షోలకు ఇబ్బంది ఉండదు. అలాగే బెనిఫిట్ షోలు కూడా అందుబాటులోకి వస్తాయి.
ఇది ఆ సినిమా ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు దారి తీస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం మారకుంటే డెంట్ కూడా గట్టిగానే పడుతుంది. అందుకే ఏపీ ఎన్నికల ఫలితాల కోసం కల్కి టీం మిగతా వాళ్ల కంటే ఎక్కువ ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఐతే సర్వేలన్నీ చాలా వరకు కూటమికే పట్టం కట్టిన నేపథ్యంలో అశ్వినీదత్ అండ్ కో ధీమాతోనే ఉన్నారు.
This post was last modified on June 4, 2024 6:59 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…