‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ. అంతకుముందే అతను ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా అది ఎలాంటి ప్రభావం చూపలేదు. కానీ ‘ఆర్ఎక్స్ 100’ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ ఛాన్సులు వస్తున్నాయి కదా అని చకచకా సినిమాలు చేసేయడం చేటు చేసింది.
‘ఆర్ఎక్స్ 100’ 2018 విడుదల కాగా.. తర్వాతి ఐదేళ్లలో అతను హీరోగా అరడజను సినిమాలు చేసేశాడు. కానీ వాటిలో ఒక్కటీ విజయవంతం కాలేదు. విలన్గా చేసిన గ్యాంగ్లీడర్, వలిమై కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో కార్తికేయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఐతే పూర్తిగా ఆశలు కోల్పోయిన స్థితిలో కార్తికేయ వరుసగా రెండు హిట్లు కొట్టడం విశేషం.
గత ఏడాది కార్తికేయ నుంచి వచ్చిన ‘బెదురులంక 2012’ సర్ప్రైజ్ హిట్ అయింది. దాని మీద రిలీజ్కు ముందు పెద్దగా అంచనాల్లేవు. కానీ మంచి వినోదం పంచడంతో ఉన్నంతలో బాగా ఆడింది. ఓటీటీలో ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది.
ఇక లేటెస్ట్గా కార్తికేయ నుంచి ‘భజే వాయు వేగం’ సినిమా వచ్చింది. దీనికి కూడా రిలీజ్ ముంగిట బజ్ లేదు. సినిమా ఆడేలా కనిపించలేదు. అందరి ఫోకస్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మీదే నిలిచింది. కానీ ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరో మూవీ ‘గం గం గణేశా’ మినిమం ఇంపాక్ట్ చూపించలేదు. కానీ ‘భజే వాయు వేగం’ మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర నిలబడింది. తొలి రోజు సాయంత్రం నుంచి పుంజుకున్న ఈ చిత్రం.. వీకెండ్లో మంచి వసూళ్లే సాధించింది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు.. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రావడం సినిమా సక్సెస్కు నిదర్శనం. మొత్తానికి కార్తీకేయ కెరీర్ నెమ్మదిగా లైన్లో పడుతున్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on June 3, 2024 4:33 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…