‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ. అంతకుముందే అతను ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా అది ఎలాంటి ప్రభావం చూపలేదు. కానీ ‘ఆర్ఎక్స్ 100’ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో కార్తికేయకు మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ ఛాన్సులు వస్తున్నాయి కదా అని చకచకా సినిమాలు చేసేయడం చేటు చేసింది.
‘ఆర్ఎక్స్ 100’ 2018 విడుదల కాగా.. తర్వాతి ఐదేళ్లలో అతను హీరోగా అరడజను సినిమాలు చేసేశాడు. కానీ వాటిలో ఒక్కటీ విజయవంతం కాలేదు. విలన్గా చేసిన గ్యాంగ్లీడర్, వలిమై కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో కార్తికేయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఐతే పూర్తిగా ఆశలు కోల్పోయిన స్థితిలో కార్తికేయ వరుసగా రెండు హిట్లు కొట్టడం విశేషం.
గత ఏడాది కార్తికేయ నుంచి వచ్చిన ‘బెదురులంక 2012’ సర్ప్రైజ్ హిట్ అయింది. దాని మీద రిలీజ్కు ముందు పెద్దగా అంచనాల్లేవు. కానీ మంచి వినోదం పంచడంతో ఉన్నంతలో బాగా ఆడింది. ఓటీటీలో ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది.
ఇక లేటెస్ట్గా కార్తికేయ నుంచి ‘భజే వాయు వేగం’ సినిమా వచ్చింది. దీనికి కూడా రిలీజ్ ముంగిట బజ్ లేదు. సినిమా ఆడేలా కనిపించలేదు. అందరి ఫోకస్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మీదే నిలిచింది. కానీ ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరో మూవీ ‘గం గం గణేశా’ మినిమం ఇంపాక్ట్ చూపించలేదు. కానీ ‘భజే వాయు వేగం’ మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర నిలబడింది. తొలి రోజు సాయంత్రం నుంచి పుంజుకున్న ఈ చిత్రం.. వీకెండ్లో మంచి వసూళ్లే సాధించింది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు.. రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రావడం సినిమా సక్సెస్కు నిదర్శనం. మొత్తానికి కార్తీకేయ కెరీర్ నెమ్మదిగా లైన్లో పడుతున్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on June 3, 2024 4:33 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…