Movie News

ఓజీ డేటుకి దేవర?

ముందు అనుకున్న ప్రకారం అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ విడుదలై రెండు నెలలు అవ్వాల్సింది. కానీ ఈ చిత్రాన్ని వేసవి రేసు నుంచి తప్పించి.. ఏకంగా అక్టోబరు 10కి వాయిదా వేసేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తారక్ అభిమానులు చాలా ఫీలయ్యారు. వాయిదా అంటే నెలో రెండు నెలలో ఉండాలి కానీ.. మరీ ఆరు నెలలేంటి అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఐతే ముందు రిలీజ్ కావడం కంటే.. పర్ఫెక్ట్ సినిమా బయటికి వచ్చి బ్లాక్‌బస్టర్ కావడం ముఖ్యమని తర్వాత వాళ్లే సర్ది చెప్పుకున్నారు. కాగా తాజాగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. ‘దేవర’ ఇప్పుడు ఖరారైన డేట్ కంటే రెండు వారాలు ముందే ప్రేక్షకుల ముందుకు రావచ్చని. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘ఓజీ’ కోసం ఎంచుకున్న సెప్టెంబరు 27 మీద ‘దేవర’ టీం ఫోకస్ చేసిందట.

‘ఓజీ’కి డిజిటల్ హక్కుల విషయంలో ఉన్న ఇబ్బంది వల్ల దాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరు 27కి ‘లక్కీ భాస్కర్’ మూవీని ఫిక్స్ చేసింది ‘సితార ఎంటర్టైన్మెంట్స్’.

పవన్ సినిమా ఆ రోజు రిలీజైతే తామెలా వస్తామని నాగవంశీ ప్రశ్నించడాన్ని బట్టి ‘ఓజీ’ ఆ రోజు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా అక్టోబరు 10న సూపర్ స్టార్ సినిమా ‘వేట్టయాన్’ కూడా రాబోతుండడంతో పాన్ ఇండియా మూవీకి క్లాష్ మంచిది కాదని ‘దేవర’ టీం భావిస్తోంది. అందుకే రెండు వారాలు ముందు, క్రేజీ డేట్ అయిన సెప్టెంబరు 27కి సినిమాను ప్రి పోన్ చేయడం గురించి ఆలోచిస్తున్నారట. ‘లక్కీ భాస్కర్’ కూడా అదే రోజు వచ్చినా పర్వాలేదు, లేదా అవసరమైతే వారం రోజులు వాయిదా వేయించొచ్చు. అందుకే అన్నీ చూసుకుని ఓజీ డేట్‌కు దేవరను ఫిక్స్ చేసే సూచనలున్నాయని అంటున్నారు.

This post was last modified on June 3, 2024 4:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago