యువ కథానాయకుడు శర్వానంద్ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా.. మనమే. ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ వచ్చిన శర్వా.. చాలా ఏళ్ల నుంచి నిఖార్సయిన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. జాను, పడి పడి లేచె మనసు, రణరంగం, ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఇలా చాలానే డిజాస్టర్లు పడ్డాయి అతడికి.
‘ఒకే ఒక జీవితం’ ఓ మాదిరిగా ఆడినా.. అది కూడా పూర్తి సంతృప్తినివ్వలేదు. దీంతో ‘మనమే’ మీద చాలా ఆశలతో ఉన్న శర్వా.. ఇది కచ్చితంగా బ్లాక్బస్టర్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు.
మురారి, ఖుషి లాంటి బ్లాక్బస్టర్లతో ‘మనమే’ చిత్రాన్ని శర్వా పోల్చడం విశేషం. హీరో హీరోయిన్లు కొట్టుకునే సినిమాలన్నీ చాలా బాగా ఆడతాయని చరిత్ర చెబుతోందని.. ‘మనమే’ విషయంలోనూ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని శర్వా చెప్పాడు.
‘‘ఈసారి కచ్చితంగా బ్లాక్బస్టర్ కొడుతున్నాం. సినిమా మామూలుగా ఉండదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. ట్రైలర్లో హీరో హీరోయిన్లు ఎలా ఒకరిని ఒకరు మాటలు అనుకున్నారో.. గొడవ పడ్డారో చూశారు కదా. ఇలా హీరో హీరోయిన్లు గొడవపడ్డ సినిమాలన్నీ కూడా తెలుగులో బ్లాక్బస్టర్లే అయ్యాయి. మురారి, ఖుషి.. ఇలా చాలా సినిమాల్లో ఇది రుజువైంది. ‘మనమే’ కూడా అదే తరహాలో బ్లాక్బస్టర్ అవుతుంది.
నా కెరీర్లోనే బెస్ట్ మూవీస్లో ఒకటిగా ‘మనమే’ నిలుస్తుంది’’ అని శర్వా ‘మనమే’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ధీమా వ్యక్తం చేశాడు. శర్వా సరసన కృతి శెట్టి కథానాయికగా నటించిన ‘మనమే’ను ‘భలే మంచి రోజు’; ‘దేవదాస్’ చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ మీద విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on June 1, 2024 8:41 pm
రెగ్యులర్ కమర్షియల్ పంధాలో వెళ్లకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్న విశ్వక్ సేన్ కు ప్రయోగాలు చేసే అవకాశాలు…
ఏపీలో వ్యవస్థలు ధ్వంస మయ్యాయని, గాడితప్పాయని.. ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన చంద్రబా బు.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత..…
1999 సెప్టెంబరు 4న హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రను నలుగురు నక్సలైట్లు…
ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిబద్ధత గలిగిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఏపీకి వస్తున్న సంగతి తెలిసిందే.…
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీలో విలన్ గా సలార్…
అధికారం ఉందని అడ్డగోలుగా అక్రమాలకు, దాడులకు, వేధింపులకు గురిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద తెలుగుదేశం ప్రభుత్వం గురిపెట్టినట్లు…