ఈ శుక్రవారం ఒకేసారి మూడు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడింటికీ విడివిడిగా మంచి క్రేజే కనిపించింది. వాటి ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించాయి. వేసవి సీజన్లో కొన్ని వారాల పాటు వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ఇవి ఊపు తీసుకొస్తాయని భావించారు.
ఐతే రిలీజ్ ముంగిట క్రేజ్ పరంగా వరుస క్రమం చూస్తే.. నంబర్ వన్ స్థాంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కనిపించింది. హీరో విశ్వక్ ‘గామి’ సక్సెస్తో మంచి ఊపు మీదున్నాడు. పైగా సితార ట్రైలర్ ఎగ్జైటింగ్గా అనిపించింది. సితార లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.
‘బేబి’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో ‘గం గం గణేశా’ రెండో స్థానంలో నిలిచింది. ఇక కార్తికేయ సరైన విజయాల్లో లేకపోవడం వల్ల ‘భజే వాయు వేగం’ మూడో స్థానానికి పరిమితమైన పరిస్థితి. అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా ఈ ట్రెండ్ కనిపించింది.
ఐతే రిలీజ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. మూడింట్లో బెస్ట్ టాక్ ‘భజే వాయు వేగం’కే రావడం విశేషం. ఎక్కువ అంచనాల మధ్య రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇటు రివ్యూలు బాలేవు. అటు మౌత్ టాక్ కూడా మిక్స్డ్గా వచ్చింది.
టాక్తో సంబంధం లేకుండా తొలి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు డల్ అయిన సంకేతాలు మార్నింగ్ షో నుంచే అర్థమైపోయింది. ‘గం గం గణేశా’కు బ్యాడ్ టాక్ రావడంతో దానికి ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. రెండో రోజు కూడా ఆ చిత్రం పుంజుకునే సంకేతాలు కనిపించడం లేదు. ఇక తొలి రోజు ఉదయం డల్లుగా మొదలైన ‘భజే వాయు వేగం’ పాజిటివ్ టాక్తో సాయంత్రానికి పుంజుకుంది.
రెండో రోజు కూడా ఆక్యుపెన్సీలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి అది మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తుందని భావివిస్తున్నారు. అంతిమంగా ‘భజే వాయు వేగం’ ఈ వీకెండ్ విన్నర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
This post was last modified on June 1, 2024 5:44 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…