ఈ శుక్రవారం ఒకేసారి మూడు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడింటికీ విడివిడిగా మంచి క్రేజే కనిపించింది. వాటి ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించాయి. వేసవి సీజన్లో కొన్ని వారాల పాటు వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ఇవి ఊపు తీసుకొస్తాయని భావించారు.
ఐతే రిలీజ్ ముంగిట క్రేజ్ పరంగా వరుస క్రమం చూస్తే.. నంబర్ వన్ స్థాంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కనిపించింది. హీరో విశ్వక్ ‘గామి’ సక్సెస్తో మంచి ఊపు మీదున్నాడు. పైగా సితార ట్రైలర్ ఎగ్జైటింగ్గా అనిపించింది. సితార లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.
‘బేబి’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో ‘గం గం గణేశా’ రెండో స్థానంలో నిలిచింది. ఇక కార్తికేయ సరైన విజయాల్లో లేకపోవడం వల్ల ‘భజే వాయు వేగం’ మూడో స్థానానికి పరిమితమైన పరిస్థితి. అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా ఈ ట్రెండ్ కనిపించింది.
ఐతే రిలీజ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. మూడింట్లో బెస్ట్ టాక్ ‘భజే వాయు వేగం’కే రావడం విశేషం. ఎక్కువ అంచనాల మధ్య రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇటు రివ్యూలు బాలేవు. అటు మౌత్ టాక్ కూడా మిక్స్డ్గా వచ్చింది.
టాక్తో సంబంధం లేకుండా తొలి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు డల్ అయిన సంకేతాలు మార్నింగ్ షో నుంచే అర్థమైపోయింది. ‘గం గం గణేశా’కు బ్యాడ్ టాక్ రావడంతో దానికి ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. రెండో రోజు కూడా ఆ చిత్రం పుంజుకునే సంకేతాలు కనిపించడం లేదు. ఇక తొలి రోజు ఉదయం డల్లుగా మొదలైన ‘భజే వాయు వేగం’ పాజిటివ్ టాక్తో సాయంత్రానికి పుంజుకుంది.
రెండో రోజు కూడా ఆక్యుపెన్సీలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి అది మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తుందని భావివిస్తున్నారు. అంతిమంగా ‘భజే వాయు వేగం’ ఈ వీకెండ్ విన్నర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ…
ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్…
వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత…
ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…
అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…
నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…