ఈ శుక్రవారం ఒకేసారి మూడు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మూడింటికీ విడివిడిగా మంచి క్రేజే కనిపించింది. వాటి ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించాయి. వేసవి సీజన్లో కొన్ని వారాల పాటు వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్కు ఇవి ఊపు తీసుకొస్తాయని భావించారు.
ఐతే రిలీజ్ ముంగిట క్రేజ్ పరంగా వరుస క్రమం చూస్తే.. నంబర్ వన్ స్థాంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కనిపించింది. హీరో విశ్వక్ ‘గామి’ సక్సెస్తో మంచి ఊపు మీదున్నాడు. పైగా సితార ట్రైలర్ ఎగ్జైటింగ్గా అనిపించింది. సితార లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.
‘బేబి’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో ‘గం గం గణేశా’ రెండో స్థానంలో నిలిచింది. ఇక కార్తికేయ సరైన విజయాల్లో లేకపోవడం వల్ల ‘భజే వాయు వేగం’ మూడో స్థానానికి పరిమితమైన పరిస్థితి. అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా ఈ ట్రెండ్ కనిపించింది.
ఐతే రిలీజ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. మూడింట్లో బెస్ట్ టాక్ ‘భజే వాయు వేగం’కే రావడం విశేషం. ఎక్కువ అంచనాల మధ్య రిలీజైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇటు రివ్యూలు బాలేవు. అటు మౌత్ టాక్ కూడా మిక్స్డ్గా వచ్చింది.
టాక్తో సంబంధం లేకుండా తొలి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు డల్ అయిన సంకేతాలు మార్నింగ్ షో నుంచే అర్థమైపోయింది. ‘గం గం గణేశా’కు బ్యాడ్ టాక్ రావడంతో దానికి ఓపెనింగ్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. రెండో రోజు కూడా ఆ చిత్రం పుంజుకునే సంకేతాలు కనిపించడం లేదు. ఇక తొలి రోజు ఉదయం డల్లుగా మొదలైన ‘భజే వాయు వేగం’ పాజిటివ్ టాక్తో సాయంత్రానికి పుంజుకుంది.
రెండో రోజు కూడా ఆక్యుపెన్సీలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి అది మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తుందని భావివిస్తున్నారు. అంతిమంగా ‘భజే వాయు వేగం’ ఈ వీకెండ్ విన్నర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
This post was last modified on June 1, 2024 5:44 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…