బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించబోయే సినిమా కోసం భారతీయులు మాత్రమే కాదు.. ఎన్నో దేశాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఆ పనులు కానిస్తూనే కాస్టింగ్ మీద దృష్టిపెట్టింది రాజమౌళి అండ్ టీమ్. ఈ చిత్రంలో నటించే ఆర్టిస్టుల గురించి రోజుకో వార్త బయటికి వస్తోంది. ఈ క్రమంలోనే ‘బాహుబలి’లో కట్టప్పగా ఎక్కడ లేని గుర్తింపు సంపాదించిన సత్యరాజ్ పేరు తెరపైకి వచ్చింది.
‘బ్రహ్మోత్సవం’లో మహేష్ బాబుకు తండ్రిగా నటించి మెప్పించిన సత్యరాజ్.. మరోసారి రాజమౌళి, మహేష్ బాబులతో జట్టు కట్టబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఐతే ఈ ప్రచారంలో నిజం లేదని సత్యరాజ్ తేల్చేశాడు.
మహేష్ బాబు-రాజమౌళి సినిమా కోసం తనను ఇప్పటిదాకా ఎవ్వరూ సంప్రదించలేదని సత్యరాజ్ తెలిపాడు. ఒకవేళ ఆ సినిమా కోసం తనను అడిగితే ఆనందంగా అంగీకరిస్తానని సత్యరాజ్ తెలిపాడు. ఇక ‘బాహుబలి’లో తనకు వచ్చిన గుర్తింపు గురించి సత్యరాజ్ మాట్లాడుతూ.. తమిళనాడు వరకు తాను సత్యరాజ్గానే అందరికీ తెలుసని.. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి తాను కట్టప్పగా పరిచయం అయ్యానని చెప్పారు. ఇందుకు రాజమౌళికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. బాహుబలిలో, అలాగే దీనికి సంబంధించిన లేటెస్ట్ యానిమేటెడ్ సిరీస్లో చూసి తనకు నిజంగానే అంతేసి కండలున్నాయని అనుకుంటున్నారని.. కానీ అది నిజం కాదని సత్యరాజ్ తెలిపాడు.
మరోవైపు తాను నరేంద్ర మోడీ బయోపిక్లో నటిస్తున్నట్లు వచ్చిన ప్రచారం గురించి కూడా సత్యరాజ్ క్లారిటీ ఇచ్చారు. తాను, మోడీ దగ్గరగా అనిపిస్తామని.. అందుకే తమ ఇద్దరి ఫొటోలు పక్కపక్కన పెట్టి తాను ఆయన బయోపిక్లో నటిస్తున్నట్లు వార్తలు పుట్టించారని.. అంతకుమించి ఇందులో వాస్తవం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. సత్యరాజ్ కీలక పాత్ర పోషించిన ‘వెపన్’ చిత్రం జూన్ 7న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
This post was last modified on May 31, 2024 3:23 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…