ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేయాలని, ఏకంగా ఈసారి 400 స్థానాలలో విజయం సాధించాలని బీజేపీ ఈసారి 543 లోక్ సభ స్థానాలకు గాను ఏడు విడతలలో సుధీర్ఘ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ సుధీర్ఘ సమయం తమకు కలిసి వస్తుందని భావించింది. 21 లోక్ సభ స్థానాలున్న ఒడిశాలో ఏకంగా నాలుగు విడతలలో పోలింగ్ నిర్వహించింది.
అయితే తొలి దఫా ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రధాని మోడీతో సహా బీజేపీ నేతలకు షాక్ ఇచ్చింది. ఏడు దఫాల్లో నెలన్నర పాటు పోలింగ్ జరిగితే తమకు లాభిస్తుందనుకొన్న బీజేపీ అంచనాలు చివరకు తలకిందులయ్యాయి. ఒక్కో విడుత మధ్య సుమారు వారంపాటు వ్యవధి ఉండటంతో ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలను విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగాయి. దీంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది.
విజయావకాశాలపై దెబ్బతీస్తాయని బీజేపీ పెద్దయెత్తున సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించింది. 130కు పైగా సీట్లలో కొత్తవారికి కట్టబెట్టింది. సిట్టింగుల మీద ఉన్న వ్యతిరేకత ఫలితాలపై ప్రభావం చూపించవచ్చన్న భయంతో వారిని తప్పించింది. ఇక గడిచిన మూడు దశాబ్దాలలో తొలిసారిగా ఈ సారి కశ్మీర్లో బీజేపీ పోటీకి దూరంగా ఉండటం గమనార్హం.
తొలిదశ పోలింగ్ సరళితో కంగుతిన్న మోడీ ఆ తర్వాత ప్రచారసరళిని మార్చి విద్వేష ప్రసంగాలకు తెరలేపారు. “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తల్లులు, చెల్లెళ్ల మంగళసూత్రాలు వదలదు. దేశ సంపదను చొరబాటు దారులు, ముస్లింలకు పంచుతుంది. వాళ్ల పాలనలో హనుమాన్ చాలీసా వినడాన్ని నేరంగా పరిగణిస్తారు. అయోధ్యలో రామమందిరం కూల్చేస్తారు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీకి 250 స్థానాలు దాటడం కష్టమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుధీర్ఘ ఎన్నికలే దీనికి కారణం అని, పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ ఈ తరహాలో ప్రచారం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారని అంటున్నారు.
This post was last modified on May 31, 2024 3:37 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…