ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న మహేష్ బాబు 29 ప్రకటన ఉంటుందేమోనని ఎదురు చూసిన అభిమానులకు ఆ శుభవార్త అందే సూచనలు లేకపోవడంతో మరికొంత కాలం ఎదురు చూడక తప్పేలా లేదు. నిజానికి ఈ ప్యాన్ వరల్డ్ మూవీ అనౌన్స్ మెంట్ కి ఇంతకన్నా మంచి రోజు ఉండదనే అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ దర్శకుడు రాజమౌళి దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఇంకా పూర్తి చేయకపోవడంతో వాయిదా వేసినట్టు తెలిసింది. హడావిడిగా ఏదీ చేయకూడదని మహేష్ సైతం మద్దతు తెలిపాడట.
ఇతర కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావిడి తీవ్రంగా ఉంది. ఒకేరోజు మూడు మూకుమ్మడిగా దాడి చేశాయి. వాటి కవరేజ్ పనిలో మీడియా బిజీగా ఉంది. ఇంకోవైపు కల్కి 2898 ఏడి హంగామా మొదలైపోయింది. నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో జనాల మూడ్ అటువైపు ఉంది. వీటి మధ్యలో ఎస్ఎస్ఎంబి గురించి మాట్లాడితే అటెన్షన్ ఒక్కసారిగా దీనివైపుకు మళ్లుతుంది కానీ అంత అర్జెంట్ ఏముందనేది జక్కన్న ఆలోచన. అసలు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలనే నిర్ణయమే ఇంకా తీసుకోలేదట .
ప్రస్తుతం వర్క్ షాప్స్, కాస్ట్యూమ్స్ ఫోటో షూట్స్ చేస్తున్న రాజమౌళి ఇంకోవైపు క్యాస్టింగ్ పనులు కూడా చూసుకుంటున్నాడు. ఆర్టిస్టులను ఖరారు చేయాల్సిన లిస్టు పెద్దదే ఉంది . బాహుబలి, ఆర్ఆర్ఆర్ ని మించిన స్కేల్ కాబట్టి ఆషామాషీగా ఉండకూడదు. డేట్ల సమస్య తలెత్తకుండా ప్లాన్ చేసుకోవాలి. రెమ్యునరేషన్లు, బడ్జెట్లు ఇవన్నీ చూసుకోవాలి. హీరో ఫైనల్ లుక్ ఇంకా ఖరారు చేయలేదు. ఒక్కసారి అది లాక్ చేశాక ఇక బయటకి కనిపించకూడదని డిసైడ్ అయ్యిందట. ఇలా అయితే మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్ట్ 9 దాకా ఎదురు చూడక తప్పేలా లేదు. చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది.
This post was last modified on May 31, 2024 11:10 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…