ఒకపక్క రిలీజ్ డేట్లు దొరకడం లేదు మహాప్రభో అంటూ నిర్మాతలు మొత్తుకుంటూనే ఇంకోవైపు వేసవిలో కొన్ని శుక్రవారాలను చేతులారా వదిలేసుకుంటున్నారు. వాటిలో జూన్ 21 ఒకటి. ఆ రోజు చెప్పుకోదగ్గ రిలీజు ఒక్కటీ లేదు.
కారణం సరిగ్గా వారం తిరిగే సరికి జూన్ 27 కల్కి 2898 ఏడి వస్తోంది కనక. ప్రభాస్ తో తలపడేందుకు ఏ ప్రొడ్యూసర్ సాహసించడం లేదు. ఒకవేళ ధైర్యం చేసి జూన్ 21 ఏదైనా ప్లాన్ చేసుకున్నా, టాక్ తో సంబంధం లేకుండా ఏడు రోజులు తిరిగే సరికి నిర్ధాక్షిణ్యంగా థియేటర్లలో నుంచి తమ సినిమాను తీసేస్తారనే ఆందోళనతో ఎందుకొచ్చిన గొడవలెమ్మని మౌనంగా ఉన్నారు.
సో సుధీర్ బాబు హరోం హరకు కొంచెం ఎక్కువ రన్ దొరికే అవకాశం దక్కినట్టు అయ్యింది. అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి జూన్ 14 రావాలా లేక ఇప్పుడు ఖాళీగా ఉన్న 21 తీసుకోవాలా అనే ఆలోచనలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.
కల్కి ఫీవర్ పది రోజుల ముందు నుంచే మొదలవుతుందనే అంచనాల నేపథ్యంలో అభిమానులతో పాటు ప్రేక్షకులు దాన్ని చూసేందుకు సిద్ధమవుతారు. ఎందుకంటే టికెట్ రేట్ల పెంపు కాస్త ఎక్కువగా ఉండబోతున్న నేపథ్యంలో దాన్ని భరించాలంటే ముందు వెనుకా సినిమాలు చూడటం తగ్గించేస్తారు. పైగా కల్కి ఫ్యామిలీస్ మొత్తాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎలా చూసుకున్నా ఏదైనా అనూహ్యంగా వస్తే తప్ప జూన్ 21 చప్పగా గడిచిపోనుంది. నిజానికి ఒకే రోజు మూడు నాలుగు సినిమాలు దండయాత్ర చేసే అతివృష్టికి కారణమైన పోకడ ఎంత ప్రమాదమో గుర్తిస్తే ఇలా వేసవి తేదీలను వృధా చేసుకునే అవసరం పడేది కాదు.
స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్లు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా 2024లో బంగారం లాంటి సమ్మర్ సీజన్ నేలపాలైనట్టే. ఒకటి రెండు హిట్లు మినహాయించి బాక్సాఫీస్ కి పూర్తి కిక్ ఇచ్చిన సినిమా ఏదీ లేకపోవడం ట్రేడ్ ని నిరాశపరిచింది.
This post was last modified on May 31, 2024 10:32 am
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…