పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలల నుంచి పూర్తిగా రాజకీయాల మీదే ఫోకస్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి ఆయన ఏ షూటింగ్లో పాల్గొనలేదు. చేతిలో ఉన్న మూడు చిత్రాలను హోల్డ్లో పెట్టించేసి వాటి నిర్మాతలను వేరే పనులు చూసుకోమన్నారు.
ఇటీవలే ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకో నాలుగు రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి. పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, అలాగే ఆయన పార్టీ జనసేన భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలోకి రావడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఐతే ఆ తీపికబురు వినడం కోసం పవన్ ఎదురు చూస్తున్నాడు.
ఎన్నికల ప్రచారంలో బాగా అలసిపోవడంతో ఆయన విశ్రాంతి కూడా తీసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చిన వెంటనే.. పవన్ సినిమాల్లో బిజీ కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
కూటమి అధికారంలోకి వస్తే పవన్, ఆయన పార్టీ ప్రభుత్వంలో భాగస్వాములవుతారా లేదా అన్నది ఆసక్తికరం. ఏదేమైనప్పటికీ కొన్ని రోజులు హడావుడి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక పవన్ నెలకు కొన్ని రోజుల చొప్పున ఒక ఐదారు నెలలు సినిమాల కోసం వీలైనన్ని ఎక్కువ డేట్లు ఇవ్వాలని భావిస్తున్నాడు.
ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు.. ఈ మూడు చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ ఆర్డర్లో చివర్లో ఉంటుందనుకున్న ‘హరిహర వీరమల్లు’కే పవన్ ముందుగా డేట్లు ఇవ్వబోతున్నాడన్నది తాజా సమాచారం. దాని బడ్జెట్ చాలా ఎక్కువ.
సినిమా ఆలస్యం కావడం వల్ల నిర్మాత రత్నం చాలా ఇబ్బంది పడ్డాడు. పైగా ఎన్నికల టైంలో ఆయన జనసేన కోసం కూడా పని చేశారు. దీంతో అందరూ అనుకున్నట్లు ముందు ‘ఓజీ’కి కాకుండా ‘హరిహర వీరమల్లు’కే డేట్స్ ఇవ్వబోతున్నారట పవన్. ‘ఓజీ’ని కొన్ని కారణాల వల్ల సెప్టెంబరు 27 నుంచి వాయిదా వేయబోతున్నారన్న సంకేతాల నేపథ్యంలో పవన్ ఫస్ట్ ప్రయారిటీ ఆ చిత్రం కాదని తెలుస్తోంది.
This post was last modified on May 31, 2024 10:12 am
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…