హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్’ విడుదలైన తర్వాతి ఏడాదే, 22 ఏళ్ల వయసులోనే శ్రియ భూపాల్తో నిశ్చితార్థం చేసుకుని పెద్ద షాకే ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఐతే కొన్ని కారణాలతో ఆ నిశ్చితార్థం రద్దయింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టాడు అక్కినేని వారసుడు. ఐతే ఇప్పుడు అతడికి 26 ఏళ్లు వచ్చేశాయి.
ఈ మధ్యలో అఖిల్ ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఏ డిస్కషన్ లేదు. హీరోగా ఇంకా తొలి విజయం అందుకోకపోవడంతో వాటి గురించి ఏం ఆలోచిస్తాడనే అభిప్రాయంతో ఉన్నారంతా. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు మళ్లీ అఖిల్ పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. అతడికి పెళ్లి కుదిరినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తెతో అఖిల్ పెళ్లి జరగబోతోందని అంటున్నారు.
విశేషం ఏంటంటే.. అఖిల్ కోసం ఈ సంబంధం తెచ్చింది అతడి వదిన, నాగచైతన్య భార్య సమంత అట. ఆమె ఇరు కుటుంబాల వాళ్లతో మాట్లాడి ఈ పెళ్లి సెట్ చేసిందట. త్వరలోనే అఖిల్ పెళ్లి గురించి అధికారిక సమాచారం బయటికి వస్తుందని అంటున్నారు. ఐతే ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది అక్కినేని కుటుంబ స్పందనను బట్టే తెలియాలి.
ప్రస్తుతం అఖిల్ అయితే తన కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పనిలో బిజీగా ఉన్నాడు. మేలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. కొన్ని రోజుల చిత్రీకరణ మిగిలి ఉండగా.. కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యల మధ్య ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభించింది చిత్ర బృందం. అఖిల్తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే ఈ షెడ్యూల్లో షూటింగ్లో పాల్గొంటోంది. దీని తర్వాత స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్వకత్వంలో అఖిల్ తన ఐదో సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 19, 2020 12:37 pm
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…