హీరోగా తన తొలి చిత్రం ‘అఖిల్’ విడుదలైన తర్వాతి ఏడాదే, 22 ఏళ్ల వయసులోనే శ్రియ భూపాల్తో నిశ్చితార్థం చేసుకుని పెద్ద షాకే ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఐతే కొన్ని కారణాలతో ఆ నిశ్చితార్థం రద్దయింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టాడు అక్కినేని వారసుడు. ఐతే ఇప్పుడు అతడికి 26 ఏళ్లు వచ్చేశాయి.
ఈ మధ్యలో అఖిల్ ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఏ డిస్కషన్ లేదు. హీరోగా ఇంకా తొలి విజయం అందుకోకపోవడంతో వాటి గురించి ఏం ఆలోచిస్తాడనే అభిప్రాయంతో ఉన్నారంతా. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు మళ్లీ అఖిల్ పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. అతడికి పెళ్లి కుదిరినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తెతో అఖిల్ పెళ్లి జరగబోతోందని అంటున్నారు.
విశేషం ఏంటంటే.. అఖిల్ కోసం ఈ సంబంధం తెచ్చింది అతడి వదిన, నాగచైతన్య భార్య సమంత అట. ఆమె ఇరు కుటుంబాల వాళ్లతో మాట్లాడి ఈ పెళ్లి సెట్ చేసిందట. త్వరలోనే అఖిల్ పెళ్లి గురించి అధికారిక సమాచారం బయటికి వస్తుందని అంటున్నారు. ఐతే ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది అక్కినేని కుటుంబ స్పందనను బట్టే తెలియాలి.
ప్రస్తుతం అఖిల్ అయితే తన కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పనిలో బిజీగా ఉన్నాడు. మేలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. కొన్ని రోజుల చిత్రీకరణ మిగిలి ఉండగా.. కట్టుదిట్టమైన జాగ్రత్త చర్యల మధ్య ఇటీవలే షూటింగ్ పున:ప్రారంభించింది చిత్ర బృందం. అఖిల్తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే ఈ షెడ్యూల్లో షూటింగ్లో పాల్గొంటోంది. దీని తర్వాత స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్వకత్వంలో అఖిల్ తన ఐదో సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on September 19, 2020 12:37 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…