సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చినా కష్టం, టాలెంట్ తో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న సుధీర్ బాబుకి గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. కాంబోలు చక్కగానే సెట్ అవుతున్నా వాటిని హ్యాండిల్ చేస్తున్న దర్శకుల తడబాటు వల్ల విజయానికి దూరంగా ఉన్నాడు. ఈసారి పూర్తిగా రూటు మార్చేసి కమర్షియల్ జానర్ లోకి వచ్చి చేసిన సినిమా హరోం హర. గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా లేకపోయి ఉంటే మే 31నే రావాల్సిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇప్పుడు జూన్ 14 విడుదలకు రెడీ అయ్యింది. ఇవాళ ట్రైలర్ ని ఆన్ లైన్ లో మహేష్ బాబు ద్వారా లాంచ్ చేయించారు.
ఇది 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) నిరుద్యోగి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటాయి. ఓ స్నేహితుడు(సునీల్) ఇచ్చిన సలహాతో తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి తుపాకీ తయారు చేస్తాడు. అది బ్రహ్మాండంగా పేలడంతో మెల్లగా దాన్నే వ్యాపారంగా మార్చుకుని ఆ ప్రాంతంలో తిరుగులేని స్థాయికి చేరుకుంటాడు. దీనికి తగ్గట్టునే శత్రువులు పుట్టుకొస్తారు. పోలీసులు వెంటపడతారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో రక్తం ఏరులై పారుతుంది. ఈ యుద్ధంలో సుబ్రహ్మణ్యం ప్రయాణం ఏ తీరానికి చేరుకుందో తెరమీద చూడాలి.
దర్శకుడు జ్ఞాన సాగర్ కున్నది ఒక్క సినిమా అనుభవమే అయినా హరోం హరని ఇంటెన్స్ డ్రామాగా మలచిన తీరు ఆసక్తి రేపుతోంది. గన్నులకు హీరోల పేర్లు పెట్టడం, అప్పటి వాతావరణాన్ని ఆర్ట్ వర్క్ ద్వారా పునః సృష్టించడం బాగున్నాయి. సుధీర్ బాబు పాత్రని అమాయకత్వంతో మొదలుపెట్టి అరాచకం వైపు తీసుకెళ్లిన వైనం మెయిన్ పాయింట్ గా కనిపిస్తోంది. హీరోయిన్ మాళవిక శర్మ, సునీల్ మినహా ఇతర ఆర్టిస్టులను ఎక్కువ రివీల్ చేయలేదు. చేతన్ భరద్వాజ్ సంగీతం, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణం ఎలివేట్ చేశాయి. ఏపీ ఫలితాలు వచ్చాక మంచి టైమింగ్ తో హరోం హర వస్తోంది.
This post was last modified on May 30, 2024 11:59 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…