సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చినా కష్టం, టాలెంట్ తో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న సుధీర్ బాబుకి గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. కాంబోలు చక్కగానే సెట్ అవుతున్నా వాటిని హ్యాండిల్ చేస్తున్న దర్శకుల తడబాటు వల్ల విజయానికి దూరంగా ఉన్నాడు. ఈసారి పూర్తిగా రూటు మార్చేసి కమర్షియల్ జానర్ లోకి వచ్చి చేసిన సినిమా హరోం హర. గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా లేకపోయి ఉంటే మే 31నే రావాల్సిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇప్పుడు జూన్ 14 విడుదలకు రెడీ అయ్యింది. ఇవాళ ట్రైలర్ ని ఆన్ లైన్ లో మహేష్ బాబు ద్వారా లాంచ్ చేయించారు.
ఇది 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు) నిరుద్యోగి. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ ఉంటాయి. ఓ స్నేహితుడు(సునీల్) ఇచ్చిన సలహాతో తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి తుపాకీ తయారు చేస్తాడు. అది బ్రహ్మాండంగా పేలడంతో మెల్లగా దాన్నే వ్యాపారంగా మార్చుకుని ఆ ప్రాంతంలో తిరుగులేని స్థాయికి చేరుకుంటాడు. దీనికి తగ్గట్టునే శత్రువులు పుట్టుకొస్తారు. పోలీసులు వెంటపడతారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో రక్తం ఏరులై పారుతుంది. ఈ యుద్ధంలో సుబ్రహ్మణ్యం ప్రయాణం ఏ తీరానికి చేరుకుందో తెరమీద చూడాలి.
దర్శకుడు జ్ఞాన సాగర్ కున్నది ఒక్క సినిమా అనుభవమే అయినా హరోం హరని ఇంటెన్స్ డ్రామాగా మలచిన తీరు ఆసక్తి రేపుతోంది. గన్నులకు హీరోల పేర్లు పెట్టడం, అప్పటి వాతావరణాన్ని ఆర్ట్ వర్క్ ద్వారా పునః సృష్టించడం బాగున్నాయి. సుధీర్ బాబు పాత్రని అమాయకత్వంతో మొదలుపెట్టి అరాచకం వైపు తీసుకెళ్లిన వైనం మెయిన్ పాయింట్ గా కనిపిస్తోంది. హీరోయిన్ మాళవిక శర్మ, సునీల్ మినహా ఇతర ఆర్టిస్టులను ఎక్కువ రివీల్ చేయలేదు. చేతన్ భరద్వాజ్ సంగీతం, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణం ఎలివేట్ చేశాయి. ఏపీ ఫలితాలు వచ్చాక మంచి టైమింగ్ తో హరోం హర వస్తోంది.
This post was last modified on May 30, 2024 11:59 am
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…