లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య.. ‘ఛల్ మోహన రంగ’ తర్వాత ఇంకో సినిమా చేయడానికి చాలా టైమే తీసుకున్నాడు. ముందు నితిన్తో ‘పవర్ పేట’ అనే సినిమా చేయడానికి సిద్ధమైన అతను.. ప్రి ప్రొడక్షన్ పూర్తి చేసి ఇక షూటింగ్కు వెళ్లడమే తరువాయి అన్నట్లు కనిపించాడు. కానీ ఆ చిత్రం బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత శర్వాతో అతను సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ సంగతి ఏమైందో తెలియదు. ఆపై విశ్వక్సేన్ హీరోగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మొదలుపెట్టాడు.
ఇది కూడా కొంచెం ఆలస్యం అయి.. ఎట్టకేలకు ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో ఈషా రెబ్బాను ఒక ఐటెం సాంగ్ కోసం ఎంచుకుని తర్వాత ఆయేషా ఖాన్తో ఆ పాట షూట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఈ మార్పులు చేర్పుల గురించి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సందర్భంగా వివరణ ఇచ్చాడు కృష్ణచైతన్య. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని ముందు శర్వానంద్తోనే తీద్దాం అనుకున్నాం. కానీ అంతకుముందే శర్వా ఇలాంటి ఎమోషనల్ సినిమా (రణరంగం కావచ్చు) చేశాడు కాబట్టి తర్వాత చేద్దాం అన్నాడు. దీంతో కొన్ని రోజుల అనంతరం విశ్వక్ను సంప్రదించి అతడితోనే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. ఇక ఈ చిత్రంలో ఐటెం సాంగ్ను ఈషా రెబ్బాతోనే ఒక రోజు షూట్ చేశాం. కానీ ఆమెకు హెల్త్ ఇష్యూ వచ్చింది. బాగా ఖర్చు పెట్టి వేసిన సెట్స్ వేస్ట్ కాకూడదని అప్పటికప్పుడు ఆయేషా ఖాన్ను సంప్రదించి ఆమెతో ఈ పాట చేశాం. ఇదంతా ఈషాతో మాట్లాడాకే జరిగింది’’ అని కృష్ణచైతన్య తెలిపాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం మంచి హైప్ మధ్యే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on May 29, 2024 5:42 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…