Movie News

దర్శకుడి మార్పు గురించి వీరమల్లు నిర్మాత

కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రెస్టీజియస్ ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకుని ఆ స్థానంలో జ్యోతికృష్ణ రావడం ఎన్నికల హడావిడిలో అంతగా హైలైట్ కాలేదు కానీ అభిమానుల మధ్య మాత్రం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరగడంతో వాళ్ళు దీని మీద ఆశలు తగ్గించుకుని దృష్టి మొత్తం ఓజి మీద పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం ఈ మార్పు గురించి స్పందించారు. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2024లోనే హరిహర వీరమల్లు విడుదలవుతుందని మరోసారి నొక్కి చెప్పడం గమనార్హం.

దర్శకుడి మార్పుపై మాట్లాడుతూ అందరికీ సర్దుబాటు కావాలనే ఉద్దేశంతో క్రిష్ స్థానంలో తన అబ్బాయి జ్యోతికృష్ణ వచ్చాడని, ముందు నుంచి స్క్రిప్ట్ గురించి పూర్తిగా తెలియడం, డైరెక్షన్ లో అనుభవం ఉండటం వల్ల పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. స్వతహాగా తాను, పవన్ కళ్యాణ్ ఇద్దరూ దర్శకులమే కాబట్టి అవసరమైన సలహాలు సూచనలు చేస్తామని అన్నారు. ఇది నిజమే కానీ రత్నంకు పెద్దరికం (మలయాళం రీమేక్) ఒకటే డైరెక్టర్ గా చెప్పుకోదగ్గ సక్సెస్. పవర్ స్టార్ కు జానీ కలిగించిన అనుభవం ఆ తర్వాత ఆ శాఖ నుంచే దూరం జరిగేలా చేసింది.

ఇవన్నీ ఎలా ఉన్నా హరిహర వీరమల్లు మొదటి భాగం ఈ సంవత్సరమే వస్తుందని చెప్పడం సంతోషించే విషయమే అయినా ఓజి కనక సెప్టెంబర్ లో వస్తే అంత తక్కువ గ్యాప్ లో ఇంకో పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ చేయడం సాధ్యమేనా అంటే ఏమో ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ ఎన్నికల్లో కూటమి గెలిస్తే కొంత కాలం పవన్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అవుతాడు. అదే జరిగితే ఓజికి వెంటనే డేట్లు ఇవ్వలేకపోవచ్చు. అలాంటప్పుడు బాలన్స్ ఉన్న హరిహర వీరమల్లుకి ఇవ్వడం గురించి అనుమానం కలగడం సహజం. దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి అనేలా పరిస్థితులున్నాయి.

This post was last modified on May 29, 2024 2:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…

5 minutes ago

దురంధర్ 2 డౌన్ అవ్వడానికి కారణాలేంటి

హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…

46 minutes ago

టొవినో డ్రాపయ్యాడు… డ్రాగన్ నో అన్నాడు

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…

2 hours ago

అనుష్కని కాసేపే చూపిస్తే ఎలా

https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…

3 hours ago

త్రివిక్రమ్… ఆ ఒక్క సీన్‌లో అసలైన స్టఫ్?

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…

3 hours ago

జ‌న‌సేన ఎమ్మెల్యేకు బాబు కితాబు

సాధార‌ణంగా త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు, ప్ర‌జాప్ర‌తినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి ప‌నితీరు మెచ్చుకుంటాయి. మ‌రింత మెరుగు ప‌రుచుకోవాల‌ని…

3 hours ago