సరిగ్గా ఇంకో నెల రోజుల్లో జూన్ 27 విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించిన ప్రమోషన్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి. కథలో కీలక పాత్ర పోషించిన బుజ్జి కారుతో బాగానే హడావిడి చేస్తున్నారు. కీర్తి సురేష్ తో డబ్బింగ్ చెప్పించడం ప్రత్యేకంగా నిలవగా నాగ చైతన్య లాంటి సెలబ్రిటీలను తీసుకొచ్చి స్వంతంగా డ్రైవింగ్ చేయించడం సోషల్ మీడియాలో బాగా వర్కౌట్ అవుతోంది. అయితే ఎంతసేపూ బుజ్జి గురించి తప్ప ఇప్పటికైతే మరో ప్రస్తావన తీసుకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇది అభిమానులకు నచ్చడం లేదు. ఏ దిల్ మాంగే మోర్ అంటూ డిమాండ్ చేస్తున్నారు.
మ్యాటర్ ఏంటంటే కల్కికి సంబంధించిన అసలైన కంటెంట్ ని ఇంకా ప్రమోషన్లలో వాడనే లేదని తెలిసింది. జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా సంయమనంతో ఉండాలని ముందే నిర్ణయించుకోవడంతో ఆ మేరకు కాస్త లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు. ఇంకా హీరోయిన్లు దీపికా పదుకునే, దిశా పటాని పరిచయం జరగలేదు. అమితాబ్ బచ్చన్ ని మాత్రమే రివీల్ చేశారు. అనుపమ్ ఖేర్, పశుపతి లాంటి క్యాస్టింగ్ ని ఒక్కొక్కరిగా ఇంట్రో రూపంలో వదలబోతున్నారు. ఎక్కువ సమయం లేదు కాబట్టి చేతిలో ఉన్న టైంలోనే ఒకపక్క బిజినెస్ చూసుకుంటూ మరోపక్క ఇవి చక్కదిద్దుతున్నారు.
అసలైన ట్విస్ట్ మరొకటి ఉంది. న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ లు కీలక క్యామియోలు చేశారనే టాక్ ఆల్రెడీ ఉంది. అయితే ముందు దీన్ని సస్పెన్స్ గా ఉంచుదామనుకున్నారు కానీ లీకయ్యింది కాబట్టి ముందే చెప్పాలా వద్దానే నిర్ణయం తీసుకోలేదట. పారితోషికాలు కలిపి మొత్తం కల్కి 2898 ఏడి నిర్మాణానికి ఆరు వందల కోట్ల దాక ఖర్చు పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. సంతోష్ నారాయణన్ ఒక్క పాట మాత్రమే స్వరపిరిచి అసలైన పనితనాన్ని బీజీఎమ్ లో చూపించబోతున్నట్టు తెలిసింది. ఆడియో లాంచ్ జూన్ మొదటివారంలోనే జరగనుంది.
This post was last modified on May 28, 2024 4:28 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…