సరిగ్గా ఇంకో నెల రోజుల్లో జూన్ 27 విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించిన ప్రమోషన్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి. కథలో కీలక పాత్ర పోషించిన బుజ్జి కారుతో బాగానే హడావిడి చేస్తున్నారు. కీర్తి సురేష్ తో డబ్బింగ్ చెప్పించడం ప్రత్యేకంగా నిలవగా నాగ చైతన్య లాంటి సెలబ్రిటీలను తీసుకొచ్చి స్వంతంగా డ్రైవింగ్ చేయించడం సోషల్ మీడియాలో బాగా వర్కౌట్ అవుతోంది. అయితే ఎంతసేపూ బుజ్జి గురించి తప్ప ఇప్పటికైతే మరో ప్రస్తావన తీసుకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఇది అభిమానులకు నచ్చడం లేదు. ఏ దిల్ మాంగే మోర్ అంటూ డిమాండ్ చేస్తున్నారు.
మ్యాటర్ ఏంటంటే కల్కికి సంబంధించిన అసలైన కంటెంట్ ని ఇంకా ప్రమోషన్లలో వాడనే లేదని తెలిసింది. జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా సంయమనంతో ఉండాలని ముందే నిర్ణయించుకోవడంతో ఆ మేరకు కాస్త లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు. ఇంకా హీరోయిన్లు దీపికా పదుకునే, దిశా పటాని పరిచయం జరగలేదు. అమితాబ్ బచ్చన్ ని మాత్రమే రివీల్ చేశారు. అనుపమ్ ఖేర్, పశుపతి లాంటి క్యాస్టింగ్ ని ఒక్కొక్కరిగా ఇంట్రో రూపంలో వదలబోతున్నారు. ఎక్కువ సమయం లేదు కాబట్టి చేతిలో ఉన్న టైంలోనే ఒకపక్క బిజినెస్ చూసుకుంటూ మరోపక్క ఇవి చక్కదిద్దుతున్నారు.
అసలైన ట్విస్ట్ మరొకటి ఉంది. న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ లు కీలక క్యామియోలు చేశారనే టాక్ ఆల్రెడీ ఉంది. అయితే ముందు దీన్ని సస్పెన్స్ గా ఉంచుదామనుకున్నారు కానీ లీకయ్యింది కాబట్టి ముందే చెప్పాలా వద్దానే నిర్ణయం తీసుకోలేదట. పారితోషికాలు కలిపి మొత్తం కల్కి 2898 ఏడి నిర్మాణానికి ఆరు వందల కోట్ల దాక ఖర్చు పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాలలో మాట్లాడుకుంటున్నారు. సంతోష్ నారాయణన్ ఒక్క పాట మాత్రమే స్వరపిరిచి అసలైన పనితనాన్ని బీజీఎమ్ లో చూపించబోతున్నట్టు తెలిసింది. ఆడియో లాంచ్ జూన్ మొదటివారంలోనే జరగనుంది.
This post was last modified on May 28, 2024 4:28 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…