జూలైలో విడుదల కాబోయే భారతీయుడు 2లో అందరూ కమల్ హాసన్ విశ్వరూపం గురించి ఆలోచిస్తున్నారు కానీ కథాపరంగా చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రను సిద్దార్థ్ దక్కించుకున్నట్టు కోలీవుడ్ లీక్. దాని ప్రకారం సేనాపతి విదేశాల్లో ఉన్నప్పుడు ఇండియాలో అవినీతి రాజకీయాల పట్ల పోరాటం చేస్తున్న యువకుడి గురించి తెలుస్తుంది. తనని ఒంటరివాడికి చేసి లక్ష్యంగా పెట్టుకున్నారని, ప్రాణాలు కూడా పోవచ్చని గుర్తించి అతన్ని రక్షించడానికే వయసు మళ్ళిన సేనాపతి భారతదేశంలో అడుగు పెట్టడంతో సినిమా మొదలవుతుందని అంటున్నారు. పాయింట్ బాగుంది కదూ.
ఇక్కడికి వచ్చాక సేనాపతికి ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు రజనీకాంత్ శివాజీ తరహాలో వ్యవస్థలో డొల్లతనాన్ని చూపిస్తూనే అతను వేసే శిక్షలను ఈసారి మరింత ప్రత్యేకంగా డిజైన్ చేశాడట దర్శకుడు శంకర్. సిద్దార్థ్ ప్రియురాలిగా రకుల్ ప్రీత్ సింగ్ చేసింది. ఈ ఇద్దరి మధ్య డ్యూయెట్ నే సెకండ్ ఆడియో సింగల్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఒక పాట తప్ప ఇంకే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయని భారతీయుడు 2 బృందం జూన్ 1 చెన్నైలో నిర్వహించబోయే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి శ్రీకారం చుట్టనుంది. చిరంజీవి, చరణ్ గెస్టులుగా వస్తారనే ప్రచారం ఉంది.
తమిళంలో బాగానే ఆఫర్లు వస్తున్నా తెలుగులో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సిద్దార్థ్ కు భారతీయుడు 2 ఆ కోరిక తీరుస్తుందేమో చూడాలి. మూడో భాగం కూడా ఉంది కాబట్టి అందులో కూడా ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. మొదటిసారి లోకనాయకుడితో కలిసి నటించడం పట్ల తను ఎగ్జైట్ అవుతున్నాడు. కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, బాబీ సింహా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న భారతీయుడు 2 రిలీజ్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇది థియేటర్లలో అడుగు పెడితే తప్ప గేమ్ ఛేంజర్ మీద శంకర్ పూర్తి ఫోకస్ పెట్టడని అర్థమైపోయింది.
This post was last modified on May 27, 2024 9:15 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…