రచయితల్లో ఎక్కువమంది దర్శకులవుతుంటారు. నటులు, కెమెరామెన్లు, వేరే టెక్నీషియన్లు కూడా మెగా ఫోన్ పడుతుంటారు. కానీ లిరిసిస్ట్గా పరిచయమై దర్శకుడిగా మారిన అరుదైన జాబితాలో కృష్ణచైతన్య ఒకడు. అతను ‘రౌడీ ఫెలో’ అనే సినిమా తీస్తున్నపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సినిమా రిలీజయ్యాక తన ప్రతిభేంటో తెలిసిందే. త్రివిక్రమ్ లాంటి మేటి రచయిత ఈ సినిమాలో డైలాగులకు ఫిదా అయిపోయాడు.
ఇప్పటికీ సోషల్ మీడియాలో ‘రౌడీ ఫెలో’ సినిమాలోని సీన్స్, డైలాగుల గురించి చర్చ జరుగుతుంటుంది. ఐతే విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ ‘రౌడీ ఫెలో’ కమర్షియల్గా మాత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కృష్ణచైతన్య.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఉమ్మడిగా నిర్మించిన ‘ఛల్ మోహన రంగ’ అనే క్రేజీ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇందులోనూ తన దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. సన్నివేశాల్లో మంచి ఫీల్ ఉంటుంది. కానీ ఈ సినిమా కూడా సరిగా ఆడలేదు.
‘ఛల్ మోహనరంగ’ రిలీజైన ఆరేళ్లకు కృష్ణచైతన్య తర్వాతి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ కానుంది. మధ్యలో నితిన్తో అనుకున్న ‘పవర పేట’ పట్టాలెక్కలేదు. వేరే కారణాల వల్ల కూడా కృష్ణచైతన్య కొత్త చిత్రం చాలా ఆలస్యమైంది. ఐతే లేటైతే అయింది కానీ.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మంచి బజ్తో, సరైన టైమింగ్తో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో నిన్నట్నుంచి చర్చనీయాంశం అవుతోంది.
సినిమాకు అవసరమైన హైప్ అంతా ఈ ట్రైలర్ తీసుకొచ్చేసింది. ప్రోమోలు చూస్తే స్యూర్ షాట్ హిట్ మూవీలా కనిపిస్తోంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. అంచనాలకు తగ్గట్లు సినిమా ఉంటే దీని రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు. మొత్తానికి దర్శకుడిగా పదేళ్ల నుంచి పోరాడుతున్న కృష్ణచైతన్యకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సరైన బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.
This post was last modified on May 27, 2024 9:29 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…