ఎంత స్టార్లయినా సరే కొన్నిసార్లు వాళ్ళ మధ్య వచ్చే విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయంటే దశాబ్దాల తరబడి గ్యాప్ వచ్చేస్తుంది. పైకి ప్రేక్షకులకు ఏ మాత్రం అనుమానం రాకుండా కెరీర్లను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటిదే ఇది. సూపర్ స్టార్ రజినీకాంత్, బాహుబలి కట్టప్పగా మనకూ బాగా సుపరిచితమైన సత్యరాజ్ కు గత 38 సంవత్సరాల్లో ఎప్పుడూ కలిసి నటించలేదంటే వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఇన్నేళ్ల తర్వాత ఈ కలయికను దర్శకుడు లోకేష్ కనగరాజ్ సాధ్యం చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. అంతగా ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.
ముప్పై ఏళ్ళ క్రితం 1994లో రజినీకాంత్ వీరా రిలీజై ఘనవిజయం సాధించింది. అదే సమయంలో సత్యరాజ్ సుకన్య జంటగా నటించిన ఓ మూవీ రిలీజ్ కి సిద్ధమయ్యింది. రెండు హిట్టయ్యాయి. అయితే బిజినెస్ సమయంలో తన పట్ల వివక్షతో డిస్ట్రిబ్యూటర్లు తక్కువ మొత్తం ఆఫర్ చేశారనే కోపం సత్యరాజ్ కు ఉండేది. తన సినిమా విజయోత్సవాన్ని ఒక చారిత్రక ప్రదేశంలో నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అదే చోట రజని సక్సెస్ మీట్ కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో కర్ణాటక నుంచి వచ్చిన బయటివాడిని తమిళ సర్కారు నెత్తినబెట్టుకుందని విమర్శలు చేశారు.
కట్ చేస్తే 2006 శివాజీలో సుమన్ పోషించిన విలన్ పాత్రకు రెట్టింపు రెమ్యునరేషన్ తో ముందు సత్యరాజ్ కే ఆఫర్ చేశారు. రజని సైతం ఓకే అన్నారు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సత్యరాజ్ ససేమిరా అన్నారు. అప్పటికి ఆగ్రహం చల్లారలేదు. రజినీకాంత్ సిఎంగా చూడటం కన్నా ఘోరం మరొకటి ఉండదని అయన అన్నట్టు మీడియా కథనాలున్నాయి. అలా ఈ కాంబో కోసం ఎందరు ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరిసారి ఇద్దరు బాలచందర్ దర్శకత్వంలో 1987 మనతిల్ ఉరుది వేండుం (తెలుగులో సిస్టర్ నందిని) లో కలిసి అతిథి పాత్రలు చేశారు. ఇప్పుడు కూలిలో స్నేహితులగా నటిస్తారని టాక్.
This post was last modified on May 27, 2024 3:24 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…