Movie News

38 సంవత్సరాల తర్వాత రజనితో కట్టప్ప

ఎంత స్టార్లయినా సరే కొన్నిసార్లు వాళ్ళ మధ్య వచ్చే విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయంటే దశాబ్దాల తరబడి గ్యాప్ వచ్చేస్తుంది. పైకి ప్రేక్షకులకు ఏ మాత్రం అనుమానం రాకుండా కెరీర్లను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటిదే ఇది. సూపర్ స్టార్ రజినీకాంత్, బాహుబలి కట్టప్పగా మనకూ బాగా సుపరిచితమైన సత్యరాజ్ కు గత 38 సంవత్సరాల్లో ఎప్పుడూ కలిసి నటించలేదంటే వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఇన్నేళ్ల తర్వాత ఈ కలయికను దర్శకుడు లోకేష్ కనగరాజ్ సాధ్యం చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. అంతగా ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.

ముప్పై ఏళ్ళ క్రితం 1994లో రజినీకాంత్ వీరా రిలీజై ఘనవిజయం సాధించింది. అదే సమయంలో సత్యరాజ్ సుకన్య జంటగా నటించిన ఓ మూవీ రిలీజ్ కి సిద్ధమయ్యింది. రెండు హిట్టయ్యాయి. అయితే బిజినెస్ సమయంలో తన పట్ల వివక్షతో డిస్ట్రిబ్యూటర్లు తక్కువ మొత్తం ఆఫర్ చేశారనే కోపం సత్యరాజ్ కు ఉండేది. తన సినిమా విజయోత్సవాన్ని ఒక చారిత్రక ప్రదేశంలో నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అదే చోట రజని సక్సెస్ మీట్ కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో కర్ణాటక నుంచి వచ్చిన బయటివాడిని తమిళ సర్కారు నెత్తినబెట్టుకుందని విమర్శలు చేశారు.

కట్ చేస్తే 2006 శివాజీలో సుమన్ పోషించిన విలన్ పాత్రకు రెట్టింపు రెమ్యునరేషన్ తో ముందు సత్యరాజ్ కే ఆఫర్ చేశారు. రజని సైతం ఓకే అన్నారు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సత్యరాజ్ ససేమిరా అన్నారు. అప్పటికి ఆగ్రహం చల్లారలేదు. రజినీకాంత్ సిఎంగా చూడటం కన్నా ఘోరం మరొకటి ఉండదని అయన అన్నట్టు మీడియా కథనాలున్నాయి. అలా ఈ కాంబో కోసం ఎందరు ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరిసారి ఇద్దరు బాలచందర్ దర్శకత్వంలో 1987 మనతిల్ ఉరుది వేండుం (తెలుగులో సిస్టర్ నందిని) లో కలిసి అతిథి పాత్రలు చేశారు. ఇప్పుడు కూలిలో స్నేహితులగా నటిస్తారని టాక్. 

This post was last modified on May 27, 2024 3:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

25 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago