ఎంత స్టార్లయినా సరే కొన్నిసార్లు వాళ్ళ మధ్య వచ్చే విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయంటే దశాబ్దాల తరబడి గ్యాప్ వచ్చేస్తుంది. పైకి ప్రేక్షకులకు ఏ మాత్రం అనుమానం రాకుండా కెరీర్లను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటిదే ఇది. సూపర్ స్టార్ రజినీకాంత్, బాహుబలి కట్టప్పగా మనకూ బాగా సుపరిచితమైన సత్యరాజ్ కు గత 38 సంవత్సరాల్లో ఎప్పుడూ కలిసి నటించలేదంటే వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఇన్నేళ్ల తర్వాత ఈ కలయికను దర్శకుడు లోకేష్ కనగరాజ్ సాధ్యం చేయబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. అంతగా ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.
ముప్పై ఏళ్ళ క్రితం 1994లో రజినీకాంత్ వీరా రిలీజై ఘనవిజయం సాధించింది. అదే సమయంలో సత్యరాజ్ సుకన్య జంటగా నటించిన ఓ మూవీ రిలీజ్ కి సిద్ధమయ్యింది. రెండు హిట్టయ్యాయి. అయితే బిజినెస్ సమయంలో తన పట్ల వివక్షతో డిస్ట్రిబ్యూటర్లు తక్కువ మొత్తం ఆఫర్ చేశారనే కోపం సత్యరాజ్ కు ఉండేది. తన సినిమా విజయోత్సవాన్ని ఒక చారిత్రక ప్రదేశంలో నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అదే చోట రజని సక్సెస్ మీట్ కు పర్మిషన్ ఇచ్చారు. దీంతో కర్ణాటక నుంచి వచ్చిన బయటివాడిని తమిళ సర్కారు నెత్తినబెట్టుకుందని విమర్శలు చేశారు.
కట్ చేస్తే 2006 శివాజీలో సుమన్ పోషించిన విలన్ పాత్రకు రెట్టింపు రెమ్యునరేషన్ తో ముందు సత్యరాజ్ కే ఆఫర్ చేశారు. రజని సైతం ఓకే అన్నారు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సత్యరాజ్ ససేమిరా అన్నారు. అప్పటికి ఆగ్రహం చల్లారలేదు. రజినీకాంత్ సిఎంగా చూడటం కన్నా ఘోరం మరొకటి ఉండదని అయన అన్నట్టు మీడియా కథనాలున్నాయి. అలా ఈ కాంబో కోసం ఎందరు ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరిసారి ఇద్దరు బాలచందర్ దర్శకత్వంలో 1987 మనతిల్ ఉరుది వేండుం (తెలుగులో సిస్టర్ నందిని) లో కలిసి అతిథి పాత్రలు చేశారు. ఇప్పుడు కూలిలో స్నేహితులగా నటిస్తారని టాక్.
This post was last modified on May 27, 2024 3:24 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…