నెల రోజుల ముందు రావాల్సిన ‘లవ్ మి’ మూవీని ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల నుంచి స్లంప్లో సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తేగల సినిమాగా దీన్ని విశ్లేషకులు భావించారు. ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే కనిపించిన రిలీజ్ రోజు సినిమాకు మంచి బజ్యే కనిపించింది. మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలో కూడా ఈ సినిమాకు బాగానే జనం కనిపించారు.
తొలి రోజు ఈ జనాన్ని చూసి టాలీవుడ్ అంతా కూడా చాలా సంతోషించింది. ‘లవ్ మి’కి ఓపెనింగ్స్ అంచనాలకు మించే వచ్చాయి. కానీ సినిమాకు టాక్ మాత్రం సరిగా లేకపోవడం మైనస్ అయింది. దీనికి తోడు ఆదివారం రోజు ఐపీఎల్ ఫైనల్ ఉండడంతో యూత్ అంతా ఆ మూడ్లోకి వెళ్లిపోయారు. ఆ ప్రభావం ‘లవ్ మి’ మీద గట్టిగానే పడింది.
కొంచెం క్రేజ్ ఉన్న కొత్త సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా శని, ఆదివారాల్లో మంచి ఆక్యుపెన్సీలు వస్తుంటాయి. కానీ ‘లవ్ మి’ శనివారం బాగానే ఆడి.. ఆదివారానికి డల్ అయిపోయింది. కళకళలాడాల్సిన ఈవెనింగ్, నైట్ షోలు ఐపీఎల్ ఫైనల్ వల్ల జనం లేక వెలవెలబోయాయి. అసలే టాక్ బాలేదు, పైగా ఐపీఎల్ ఫైనల్.. ఇక సినిమాకు ఎందుకు వెళ్తారు యూత్. ఈ చిత్రాన్ని శనివారం రిలీజ్ చేయడం రాంగ్ డెసిషన్ అనడంలో సందేహం లేదు.
శుక్రవారం రిలీజై ఉంటే.. తొలి రోజు ఎలాగూ ఓపెనింగ్స్ ఉంటాయి. శనివారం కూడా మంచి వసూళ్లు సాధించేది. ఆదివారం ఎలా ఉన్నా కొంత మేర సినిమా సేఫ్ అయ్యేది. ఇప్పుడు కేవలం ఒక్క రోజు వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. టాక్ బాలేదు కాబట్టి సోమవారం నుంచి ఎలాగూ వసూళ్ల మీద ఆశలు ఉండవు. మొత్తంగా చూస్తే నెల రోజులు వాయిదా వేసుకున్నా చివరికి సరైన ప్లానింగ్ లేకుండా సినిమాను రిలీజ్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంటోంది ‘లవ్ మి’ టీం.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…