నెల రోజుల ముందు రావాల్సిన ‘లవ్ మి’ మూవీని ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల నుంచి స్లంప్లో సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తేగల సినిమాగా దీన్ని విశ్లేషకులు భావించారు. ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే కనిపించిన రిలీజ్ రోజు సినిమాకు మంచి బజ్యే కనిపించింది. మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలో కూడా ఈ సినిమాకు బాగానే జనం కనిపించారు.
తొలి రోజు ఈ జనాన్ని చూసి టాలీవుడ్ అంతా కూడా చాలా సంతోషించింది. ‘లవ్ మి’కి ఓపెనింగ్స్ అంచనాలకు మించే వచ్చాయి. కానీ సినిమాకు టాక్ మాత్రం సరిగా లేకపోవడం మైనస్ అయింది. దీనికి తోడు ఆదివారం రోజు ఐపీఎల్ ఫైనల్ ఉండడంతో యూత్ అంతా ఆ మూడ్లోకి వెళ్లిపోయారు. ఆ ప్రభావం ‘లవ్ మి’ మీద గట్టిగానే పడింది.
కొంచెం క్రేజ్ ఉన్న కొత్త సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా శని, ఆదివారాల్లో మంచి ఆక్యుపెన్సీలు వస్తుంటాయి. కానీ ‘లవ్ మి’ శనివారం బాగానే ఆడి.. ఆదివారానికి డల్ అయిపోయింది. కళకళలాడాల్సిన ఈవెనింగ్, నైట్ షోలు ఐపీఎల్ ఫైనల్ వల్ల జనం లేక వెలవెలబోయాయి. అసలే టాక్ బాలేదు, పైగా ఐపీఎల్ ఫైనల్.. ఇక సినిమాకు ఎందుకు వెళ్తారు యూత్. ఈ చిత్రాన్ని శనివారం రిలీజ్ చేయడం రాంగ్ డెసిషన్ అనడంలో సందేహం లేదు.
శుక్రవారం రిలీజై ఉంటే.. తొలి రోజు ఎలాగూ ఓపెనింగ్స్ ఉంటాయి. శనివారం కూడా మంచి వసూళ్లు సాధించేది. ఆదివారం ఎలా ఉన్నా కొంత మేర సినిమా సేఫ్ అయ్యేది. ఇప్పుడు కేవలం ఒక్క రోజు వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. టాక్ బాలేదు కాబట్టి సోమవారం నుంచి ఎలాగూ వసూళ్ల మీద ఆశలు ఉండవు. మొత్తంగా చూస్తే నెల రోజులు వాయిదా వేసుకున్నా చివరికి సరైన ప్లానింగ్ లేకుండా సినిమాను రిలీజ్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంటోంది ‘లవ్ మి’ టీం.
This post was last modified on May 27, 2024 3:02 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…