నెల రోజుల ముందు రావాల్సిన ‘లవ్ మి’ మూవీని ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల నుంచి స్లంప్లో సాగుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తేగల సినిమాగా దీన్ని విశ్లేషకులు భావించారు. ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగానే కనిపించిన రిలీజ్ రోజు సినిమాకు మంచి బజ్యే కనిపించింది. మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలో కూడా ఈ సినిమాకు బాగానే జనం కనిపించారు.
తొలి రోజు ఈ జనాన్ని చూసి టాలీవుడ్ అంతా కూడా చాలా సంతోషించింది. ‘లవ్ మి’కి ఓపెనింగ్స్ అంచనాలకు మించే వచ్చాయి. కానీ సినిమాకు టాక్ మాత్రం సరిగా లేకపోవడం మైనస్ అయింది. దీనికి తోడు ఆదివారం రోజు ఐపీఎల్ ఫైనల్ ఉండడంతో యూత్ అంతా ఆ మూడ్లోకి వెళ్లిపోయారు. ఆ ప్రభావం ‘లవ్ మి’ మీద గట్టిగానే పడింది.
కొంచెం క్రేజ్ ఉన్న కొత్త సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా శని, ఆదివారాల్లో మంచి ఆక్యుపెన్సీలు వస్తుంటాయి. కానీ ‘లవ్ మి’ శనివారం బాగానే ఆడి.. ఆదివారానికి డల్ అయిపోయింది. కళకళలాడాల్సిన ఈవెనింగ్, నైట్ షోలు ఐపీఎల్ ఫైనల్ వల్ల జనం లేక వెలవెలబోయాయి. అసలే టాక్ బాలేదు, పైగా ఐపీఎల్ ఫైనల్.. ఇక సినిమాకు ఎందుకు వెళ్తారు యూత్. ఈ చిత్రాన్ని శనివారం రిలీజ్ చేయడం రాంగ్ డెసిషన్ అనడంలో సందేహం లేదు.
శుక్రవారం రిలీజై ఉంటే.. తొలి రోజు ఎలాగూ ఓపెనింగ్స్ ఉంటాయి. శనివారం కూడా మంచి వసూళ్లు సాధించేది. ఆదివారం ఎలా ఉన్నా కొంత మేర సినిమా సేఫ్ అయ్యేది. ఇప్పుడు కేవలం ఒక్క రోజు వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. టాక్ బాలేదు కాబట్టి సోమవారం నుంచి ఎలాగూ వసూళ్ల మీద ఆశలు ఉండవు. మొత్తంగా చూస్తే నెల రోజులు వాయిదా వేసుకున్నా చివరికి సరైన ప్లానింగ్ లేకుండా సినిమాను రిలీజ్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంటోంది ‘లవ్ మి’ టీం.
This post was last modified on May 27, 2024 3:02 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…