ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘గేమ్ చేంజర్’ ఒకటి. ఐతే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. ఎట్టకేలకు సినిమా ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఐతే సినిమా మొదలైన దగ్గర్నుంచి ‘గేమ్ చేంజర్’ విషయంలో అభిమానుల కంప్లైంట్స్ ఏంటంటే.. సమయానికి అప్డేట్స్ ఏమీ ఇవ్వట్లేదని. ఐతే శంకర్ సినిమా అంటే వ్యవహారం అలాగే ఉంటుంది. మేకింగ్ దశలో విశేషాలేవీ బయటికి రానివ్వరు.
సినిమా అంతా అయ్యాకే ప్రమోషన్ మొదలుపెడతారు. ఐతే సినిమా షూటింగ్లోనే చాలా జాప్యం జరగడంతో చరణ్ ఫ్యాన్స్ మరీ ఎక్కువ కాలం వేచి చూడాల్సి వచ్చి అసహనానికి గురవుతున్నారు.
‘గేమ్ చేంజర్’లో ముఖ్య పాత్ర పోషిస్తున్న అంజలి తన కొత్త చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసినపుడు ‘గేమ్ చేంజర్’ గురించి అడిగితే చాలా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నట్లు తెలిపింది.
“గేమ్ చేంజర్ సినిమా గురించి, అందులో నా పాత్ర గురించి చాలా మాట్లాడాలని ఉంది. ఎన్నో విషయాలు నా గొంతు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. ఏం చేద్దాం. ఈ సినిమా గురించి ప్రొడక్షన్ హౌస్ కానీ, దర్శకుడు శంకర్ గారు కానీ ఏమీ మాట్లాడట్లేదు. ఎవరినీ ఏమీ మాట్లాడొద్దంటున్నారు. దీంతో నేను మౌనం వహించాల్సి వస్తోంది. నా నోటికి ప్లాస్టర్ వేసినట్లు అనిపిస్తోంది. కానీ సినిమాలో ఎగ్జైటింగ్ విషయాలు చాలా ఉన్నాయి” అని అంజలి తెలిపింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 26, 2024 4:00 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…