టాలీవుడ్లో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొనే కుటుంబాల్లో మంచు వారిది ముందుంటుందన్నది వాస్తవం. ముఖ్యంగా మంచు లక్ష్మి కెరీర్ ట్రోల్స్తోనే మొదలైంది. అమెరికాలో చాలా ఏళ్లు ఉండి వచ్చిన లక్ష్మి.. అక్కడి యాక్సెంట్తో మాట్లాడ్డం మీద చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంది.
అంతే కాక సినిమాల్లో లక్ష్మి పాత్రలు, నటన విషయంలోనూ ట్రోల్స్ తప్పలేదు. ఐతే తాను ఎంత స్పోర్టివ్ అయినప్పటికీ.. ట్రోల్స్ చూసి గతంలో బాధ పడేదాన్నని లక్ష్మి తెలిపింది.
“నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని. మీ బిడ్డని. మొదట్నుంచి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం నాది. కొందరు నన్ను అదే పనిగా ట్రోల్స్ చేయడం చూసి బాధవేసేది. నాకు పొలిటికల్లీ కరెక్ట్గా మాట్లాడ్డం రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. అది కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. ఎవరో కావాలని నన్ను ట్రోల్స్ చేస్తారని భావించను. కానీ మొదట్లో ట్రోల్స్ చూసి బాధ పడ్డ నేను తర్వాత వాటికి అలవాటు పడిపోయాను’’ అని తాను నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో లక్ష్మి తెలిపింది.
ఇక తమ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునన ‘కన్నప్ప’ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేసిన లక్ష్మి.. అందులో తన తమ్ముడు మనోజ్ కూడా లేడని తెలిపింది.
‘కన్నప్ప’లో తాను ఎందుకు లేనని చాలామంది అడిగారని… కానీ తనకు సరిపోయే పాత్ర లేదు కాబట్టే అందులో నటించట్లేదని భావిస్తున్నట్లు తెలిపింది. తాను, మనోజ్ కూడా ఉంటే అది తమ ఫ్యామిలీ సినిమా అయిపోతుందని.. అలా ఉండొద్దనే భావిస్తున్నానని లక్ష్మి తెలిపింది.
This post was last modified on May 25, 2024 5:41 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…