టాలీవుడ్లో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొనే కుటుంబాల్లో మంచు వారిది ముందుంటుందన్నది వాస్తవం. ముఖ్యంగా మంచు లక్ష్మి కెరీర్ ట్రోల్స్తోనే మొదలైంది. అమెరికాలో చాలా ఏళ్లు ఉండి వచ్చిన లక్ష్మి.. అక్కడి యాక్సెంట్తో మాట్లాడ్డం మీద చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంది.
అంతే కాక సినిమాల్లో లక్ష్మి పాత్రలు, నటన విషయంలోనూ ట్రోల్స్ తప్పలేదు. ఐతే తాను ఎంత స్పోర్టివ్ అయినప్పటికీ.. ట్రోల్స్ చూసి గతంలో బాధ పడేదాన్నని లక్ష్మి తెలిపింది.
“నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని. మీ బిడ్డని. మొదట్నుంచి ముక్కుసూటిగా మాట్లాడే తత్వం నాది. కొందరు నన్ను అదే పనిగా ట్రోల్స్ చేయడం చూసి బాధవేసేది. నాకు పొలిటికల్లీ కరెక్ట్గా మాట్లాడ్డం రాదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా. అది కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. ఎవరో కావాలని నన్ను ట్రోల్స్ చేస్తారని భావించను. కానీ మొదట్లో ట్రోల్స్ చూసి బాధ పడ్డ నేను తర్వాత వాటికి అలవాటు పడిపోయాను’’ అని తాను నటించిన ‘యక్షిణి’ వెబ్ సిరీస్కు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో లక్ష్మి తెలిపింది.
ఇక తమ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునన ‘కన్నప్ప’ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేసిన లక్ష్మి.. అందులో తన తమ్ముడు మనోజ్ కూడా లేడని తెలిపింది.
‘కన్నప్ప’లో తాను ఎందుకు లేనని చాలామంది అడిగారని… కానీ తనకు సరిపోయే పాత్ర లేదు కాబట్టే అందులో నటించట్లేదని భావిస్తున్నట్లు తెలిపింది. తాను, మనోజ్ కూడా ఉంటే అది తమ ఫ్యామిలీ సినిమా అయిపోతుందని.. అలా ఉండొద్దనే భావిస్తున్నానని లక్ష్మి తెలిపింది.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…