జూనియర్ ఎన్టీఆర్ దేవర మీద ఎలాంటి అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇటీవలే విడుదలైన మొదటి లిరికల్ వీడియో ఫియర్ పట్ల తొలుత మిశ్రమ స్పందన కనిపించినా తర్వాత ఛార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెట్టడం అభిమానులకు కొత్త ఎనర్జీని ఇచ్చింది. క్రికెట్, రాజకీయాల్లో ఇటీవల జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలకు దీన్నే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వాడుకోవడాన్ని బట్టే చెప్పొచ్చు ఎంతగా రీచ్ వచ్చిందో. ఇదిలా ఉండగా కథకు సంబంధించిన క్లూస్ ఎక్కువగా లీకవ్వకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ ఏదో ఒక రూపం కొన్ని బయటికి వచ్చి ఫ్యాన్స్ లో హైప్ ని మరింత పెంచుతున్నాయి.
తాజాగా తెలిసిన అప్డేట్ ప్రకారం దేవరలో తారక్ సముద్రపు ఒడ్డున ఉండే పది ఊళ్ళను కాపు కాసే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తాడట. టీజర్, ఫియర్ సాంగ్ లో చూపించే యాక్షన్ ఎపిసోడ్ అందులో భాగంగానే వస్తుందని తెలిసింది. అక్కడ దొరికే విలువైన సంపద కోసం ముష్కరులు కుట్ర వేసి పది వేల మందితో దాడి చేస్తే వాళ్ళను ఊచకోత కోస్తూ దేవర చూపించే విశ్వరూపం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఎరుపెక్కిన సముద్రమంతా నెత్తురుతో నిండిపోయి ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని రక్తపాతాన్ని దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరిస్తారని అంటున్నారు.
వినడానికే ఇంత ఎగ్జైట్ మెంట్ అనిపిస్తున్న ఈ ఎపిసోడ్ ఇక తెరమీద ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. దేవర రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులుగా జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఇప్పటికే ఉంది. కాకపోతే బాహుబలి తరహాలో ఉంటుందా లేక ఒకేసారి ఇద్దరినీ తెరమీద చూపించేలా కొరటాల స్క్రిప్ట్ రాసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అనిరుద్ రవిచందర్ మీద జనాలకు నమ్మకం వచ్చేసింది. హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇంటర్వ్యూలలో దేవర గురించి నొక్కి చెబుతోంది. అక్టోబర్ 10 విడుదలలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు.
This post was last modified on May 25, 2024 1:17 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…