బాలీవుడ్ బడా స్టార్లలో ఒకడైన సంజయ్ దత్ జీవితం ఎప్పుడూ నిలకడగా, ప్రశాంతంగా సాగింది లేదు. మాఫియాతో లింకులు, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అతను చాలా ఏళ్ల పాటు వేదన అనుభవించాడు. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అంతటితో అతడి జీవితంలో చెడు రోజులు అయిపోయాయని అనుకున్నారు కానీ.. కొన్నేళ్ల విరామం తర్వాత అతడికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
ఇటీవలే సంజుకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని.. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని ఇటీవలే వెల్లడైంది. దీంతో బాలీవుడ్లో అతడి సన్నిహితులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అతడి కోసం అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ముంబయిలోనే చికిత్స తీసుకున్న సంజయ్ దత్.. చికిత్స కోసమో, మరో దాని కోసమో కానీ.. తాజాగా దుబాయ్కి వెళ్లాడు.
అక్కడ తన భార్య మాన్యత, పిల్లలతో కలిసి సంజయ్ దత్ దిగిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో సంజయ్ బాగా వీక్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. మామూలుగా గడ్డంతో కనిపించే సంజు.. క్లీన్ షేవ్ చేసుకోగా.. ముఖం చిన్నదైపోయింది. కళ్లు లోపలికి వెళ్లిపోయాయి. మొత్తంగా సంజు ఏమాత్రం హుషారు లేకుండా శోకంలో ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు.
అనారోగ్యం వల్ల అతడి శరీరం కుంగుబాటుకు లోనైందా.. లేక మానసిక వేదనతో అలా అయ్యాడా అన్నది తెలియదు కానీ.. ఈ లుక్లో సంజును చూడగానే అభిమానులకు దు:ఖం పొంగుకొస్తోంది. అతను కోలుకుని మామూలు మనిషి కావాలని వాళ్లు గట్టిగా కోరుకుంటున్నారు. అత్యాధునిక చికిత్స కోసం సంజు త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సంజు నటిస్తున్న, నటించాల్సిన సినిమాలు అరడజనుకు పైగానే ఉన్నాయి. అతను అనారోగ్యం బారిన పడటంతో 700 కోట్ల మేర పెట్టుబడులు రిస్క్లో పడ్డాయి.
This post was last modified on September 18, 2020 4:22 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…