బాలీవుడ్ బడా స్టార్లలో ఒకడైన సంజయ్ దత్ జీవితం ఎప్పుడూ నిలకడగా, ప్రశాంతంగా సాగింది లేదు. మాఫియాతో లింకులు, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అతను చాలా ఏళ్ల పాటు వేదన అనుభవించాడు. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అంతటితో అతడి జీవితంలో చెడు రోజులు అయిపోయాయని అనుకున్నారు కానీ.. కొన్నేళ్ల విరామం తర్వాత అతడికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
ఇటీవలే సంజుకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని.. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని ఇటీవలే వెల్లడైంది. దీంతో బాలీవుడ్లో అతడి సన్నిహితులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అతడి కోసం అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ముంబయిలోనే చికిత్స తీసుకున్న సంజయ్ దత్.. చికిత్స కోసమో, మరో దాని కోసమో కానీ.. తాజాగా దుబాయ్కి వెళ్లాడు.
అక్కడ తన భార్య మాన్యత, పిల్లలతో కలిసి సంజయ్ దత్ దిగిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో సంజయ్ బాగా వీక్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. మామూలుగా గడ్డంతో కనిపించే సంజు.. క్లీన్ షేవ్ చేసుకోగా.. ముఖం చిన్నదైపోయింది. కళ్లు లోపలికి వెళ్లిపోయాయి. మొత్తంగా సంజు ఏమాత్రం హుషారు లేకుండా శోకంలో ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు.
అనారోగ్యం వల్ల అతడి శరీరం కుంగుబాటుకు లోనైందా.. లేక మానసిక వేదనతో అలా అయ్యాడా అన్నది తెలియదు కానీ.. ఈ లుక్లో సంజును చూడగానే అభిమానులకు దు:ఖం పొంగుకొస్తోంది. అతను కోలుకుని మామూలు మనిషి కావాలని వాళ్లు గట్టిగా కోరుకుంటున్నారు. అత్యాధునిక చికిత్స కోసం సంజు త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సంజు నటిస్తున్న, నటించాల్సిన సినిమాలు అరడజనుకు పైగానే ఉన్నాయి. అతను అనారోగ్యం బారిన పడటంతో 700 కోట్ల మేర పెట్టుబడులు రిస్క్లో పడ్డాయి.
This post was last modified on September 18, 2020 4:22 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…