బాలీవుడ్ బడా స్టార్లలో ఒకడైన సంజయ్ దత్ జీవితం ఎప్పుడూ నిలకడగా, ప్రశాంతంగా సాగింది లేదు. మాఫియాతో లింకులు, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అతను చాలా ఏళ్ల పాటు వేదన అనుభవించాడు. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అంతటితో అతడి జీవితంలో చెడు రోజులు అయిపోయాయని అనుకున్నారు కానీ.. కొన్నేళ్ల విరామం తర్వాత అతడికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
ఇటీవలే సంజుకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని.. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని ఇటీవలే వెల్లడైంది. దీంతో బాలీవుడ్లో అతడి సన్నిహితులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అతడి కోసం అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ముంబయిలోనే చికిత్స తీసుకున్న సంజయ్ దత్.. చికిత్స కోసమో, మరో దాని కోసమో కానీ.. తాజాగా దుబాయ్కి వెళ్లాడు.
అక్కడ తన భార్య మాన్యత, పిల్లలతో కలిసి సంజయ్ దత్ దిగిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో సంజయ్ బాగా వీక్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. మామూలుగా గడ్డంతో కనిపించే సంజు.. క్లీన్ షేవ్ చేసుకోగా.. ముఖం చిన్నదైపోయింది. కళ్లు లోపలికి వెళ్లిపోయాయి. మొత్తంగా సంజు ఏమాత్రం హుషారు లేకుండా శోకంలో ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు.
అనారోగ్యం వల్ల అతడి శరీరం కుంగుబాటుకు లోనైందా.. లేక మానసిక వేదనతో అలా అయ్యాడా అన్నది తెలియదు కానీ.. ఈ లుక్లో సంజును చూడగానే అభిమానులకు దు:ఖం పొంగుకొస్తోంది. అతను కోలుకుని మామూలు మనిషి కావాలని వాళ్లు గట్టిగా కోరుకుంటున్నారు. అత్యాధునిక చికిత్స కోసం సంజు త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సంజు నటిస్తున్న, నటించాల్సిన సినిమాలు అరడజనుకు పైగానే ఉన్నాయి. అతను అనారోగ్యం బారిన పడటంతో 700 కోట్ల మేర పెట్టుబడులు రిస్క్లో పడ్డాయి.
This post was last modified on September 18, 2020 4:22 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…