బాలీవుడ్ బడా స్టార్లలో ఒకడైన సంజయ్ దత్ జీవితం ఎప్పుడూ నిలకడగా, ప్రశాంతంగా సాగింది లేదు. మాఫియాతో లింకులు, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అతను చాలా ఏళ్ల పాటు వేదన అనుభవించాడు. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. అంతటితో అతడి జీవితంలో చెడు రోజులు అయిపోయాయని అనుకున్నారు కానీ.. కొన్నేళ్ల విరామం తర్వాత అతడికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.
ఇటీవలే సంజుకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని.. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని ఇటీవలే వెల్లడైంది. దీంతో బాలీవుడ్లో అతడి సన్నిహితులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అతడి కోసం అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ముంబయిలోనే చికిత్స తీసుకున్న సంజయ్ దత్.. చికిత్స కోసమో, మరో దాని కోసమో కానీ.. తాజాగా దుబాయ్కి వెళ్లాడు.
అక్కడ తన భార్య మాన్యత, పిల్లలతో కలిసి సంజయ్ దత్ దిగిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో సంజయ్ బాగా వీక్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. మామూలుగా గడ్డంతో కనిపించే సంజు.. క్లీన్ షేవ్ చేసుకోగా.. ముఖం చిన్నదైపోయింది. కళ్లు లోపలికి వెళ్లిపోయాయి. మొత్తంగా సంజు ఏమాత్రం హుషారు లేకుండా శోకంలో ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు.
అనారోగ్యం వల్ల అతడి శరీరం కుంగుబాటుకు లోనైందా.. లేక మానసిక వేదనతో అలా అయ్యాడా అన్నది తెలియదు కానీ.. ఈ లుక్లో సంజును చూడగానే అభిమానులకు దు:ఖం పొంగుకొస్తోంది. అతను కోలుకుని మామూలు మనిషి కావాలని వాళ్లు గట్టిగా కోరుకుంటున్నారు. అత్యాధునిక చికిత్స కోసం సంజు త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సంజు నటిస్తున్న, నటించాల్సిన సినిమాలు అరడజనుకు పైగానే ఉన్నాయి. అతను అనారోగ్యం బారిన పడటంతో 700 కోట్ల మేర పెట్టుబడులు రిస్క్లో పడ్డాయి.
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…
తెలుగులో వచ్చిన ఉత్తమ హార్రర్ చిత్రాల్లో.. ‘మసూద’ కచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు. ఇందులో పెద్దగా పేరున్న నటులేమీ నటించలేదు. అప్…
తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనాల్లో ‘బేబీ’ ఒకటి. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్…
సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం జగన్ నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు…
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…