ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే రామ్ చరణ్ 16కి సంబంధించిన రకరకాల వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే ఈ విలేజ్ డ్రామాలో హీరోకు తల్లిగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒప్పుకున్నారనే టాక్ గట్టిగా తిరగడంతో అది నిజమేనేమోనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు అదంతా వట్టి పుకారే.
బలమైన క్యాస్టింగ్ కోసం బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవమే అయినా ఆవిడని కలుసుకోలేదని తెలిసింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత తాను ఇక నటించననని దాని ప్రమోషన్ల టైంలో లేడీ అమితాబ్ స్పష్టంగా చెప్పారు.
ఇప్పుడు హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం ఉండదు. విజయశాంతి ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఇలాంటి టైంలో మేకప్ వేసుకుని మళ్ళీ తెరమీద కనిపించే ఆలోచన ఎంత మాత్రం చేయరని సన్నిహితుల మాట.
కాసేపు ఈ గాసిప్పుని పక్కనపెడితే ఊహించుకోవడానికైతే ఈ కాంబో బాగుంది. ఒకప్పుడు చిరంజీవి విజయశాంతి కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ అబ్బాయికి విజయశాంతి తల్లిగా నటించడం బాగుంటుంది. మహేష్ బాబు సినిమాలో ఆవిడ పిల్లల తల్లిగా నటించారు కానీ హీరో పాత్రకు కాదనే విషయం మర్చిపోకూడదు.
వీలైనంత లీకులు రాకుండా రామ్ చరణ్ 16 టీమ్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక్క జాన్వీ కపూర్ పేరు మాత్రమే అధికారికంగా బయటికి వచ్చింది. గేమ్ ఛేంజర్ ఎప్పుడు పూర్తవుతుందో సరైన స్పష్టత లేని కారణంగా బుచ్చిబాబు ఇంకా వెయిటింగ్ మోడ్ లోనే ఉండాల్సి వస్తోంది. దీని నిర్మాణానికి కనీసం ఏడాది కావాలి.
మరీ ఆలస్యం చేస్తే చరణ్ తర్వాత సుకుమార్ తో చేయాల్సిన మూవీ లేట్ అవుతుంది. గురువు కోసమైనా బుచ్చిబాబు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు. ఏఆర్ రెహమాన్ మూడు పాటలు సమకూర్చిన ఆర్సి 16 మిగిలిన సాంగ్స్ రికార్డింగ్ ఈ వేసవిలోనే రికార్డు చేయబోతున్నట్టు తెలిసింది.
This post was last modified on May 23, 2024 6:15 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…